సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. వాస్తవానికి జూన్ నెల నుండి మొదలవుతుందని అప్పట్లో తెలియజేశారు. కానీ మహేష్ బాబు “సర్కారు వారి పాట” విజయం తర్వాత ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ వెళ్ళటం… మొన్నటి వరకు రాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ అసలు ఎప్పుడు మొదలవుతుందో అనే ప్రశ్నలు అభిమానులలో మొదలయ్యాయి.
అయితే తాజాగా సినిమా యూనిట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అధికారిక ప్రకటన చేశారు. వచ్చేనెల ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యి… వచ్చే ఏడాది వేసవికాలంలో సినిమా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని.. సినిమా యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
అంతకుముందే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోసారి మహేశ్, పూజ హెగ్డే కలిసి నటిస్తుండటంతో.. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఒక సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ బాబు నటించిన అతడు, ఖలేజా పండు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో మూడోసారి వీరిద్దరూ కలిసి చేయడంతో పాటు 11 సంవత్సరాల తర్వాత కలిసి పని చేస్తూ ఉండటంతో “SSMB 28” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!