Vijay Deverakonda: రౌడీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన “లైగర్” అట్టర్ ఫ్లాప్ కావటం తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేసిన “లైగర్” అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండకి ఈ సినిమా మరింత దెబ్బ వేసింది. “లైగర్” కోసం ఏకంగా రెండున్నర సంవత్సరాలు కష్టపడినా సినిమా రిసల్ట్ మొదటి ఆటకి అట్టర్ ఫ్లాప్ రావడం భారీగా దెబ్బ వేసింది. దీంతో ప్రస్తుతం ఫాన్స్ మొత్తం “ఖుషి” సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఖుషి”లో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల ఈ అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో తనని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అభిమానులకు… విజయ్ దేవరకొండ ట్రిప్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. విషయంలోకి వెళ్తే ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ ఓ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోల విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…”అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మీలో వందమంది పర్వతాల వద్దకు వెళ్తారు. మీకోసం బిగ్ కిస్సెస్ ప్రేమ అందిస్తున్నాను. మీలో వంద మందిని మనాలి ట్రిప్ కోసం పంపించాలని అనుకుంటున్నాను. ఈ ట్రిప్పులో ఆహారం మరియు ప్రయాణం ఇంకా వసతి అంతా నేనే చూసుకుంటాను. మనాలి ట్రిప్ ఐదు రోజులు మాత్రమే.
మంచు దుప్పటి వేసిన పర్వతాలకు ఆలయాలకు… మఠాలకు వెళ్తారు. ఎన్నో యాక్టివిటీలకు ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రిప్పు రావాలనుకునే వారి వయసు 18 సంవత్సరాల నుండి ఉండాలి. అలా అయిన వాళ్ళు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు గూగుల్ డాక్యుమెంట్ పూర్తిచేయండి. మీలో 100 మందిని ఎంపిక చేసి మనాలికి పంపిస్తాను. మీతో కూడా నేను కూడా ఈ ట్రిప్పులో జాయిన్ అవుతాను అంటూ… అభిమానులకు విజయ్ దేవరకొండ ఊహించని బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!