‘లైగర్’ ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇటీవలే ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ వేడుకలు హైదరాబాద్ ఇంకా ముంబై నగరాలలో అభిమానుల మధ్య ఘనంగా చేయడం జరిగింది. ‘లైగర్’ తెలుగు ట్రైలర్ చిరంజీవితో పాటు ప్రభాస్ రిలీజ్ చేశారు. ఇక హిందీ ట్రైలర్ నీ రణవీర్ సింగ్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను 30 నగరాలలో వినూత్నంగా హీరో విజయ్ దేవరకొండ తో పాటు హీరోయిన్ అనన్య పాండే చేస్తుంది.
మొన్న ముంబాయి.. బాంద్రా వీధులలో పిల్లలతో కలిసి ఇటీవలే హీరో మరియు హీరోయిన్ ఇద్దరు కలిసి డాన్స్ వేయడం జరిగింది. చాలా వరకు జనాల్లోకి వెళ్ళడానికి ‘లైగర్’ సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ముంబైలో ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఈ ఇద్దరూ ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయణించారు. ముంబైలో ట్రాఫిక్ చిక్కుల నుండి తప్పించుకునే రీతిలో లోకల్ ట్రైన్ ఎక్కటం జరిగింది. ట్రైన్ లో విజయదేవరకొండ తో పాటు హీరోయిన్ అనన్య పాండే కూడా ఎక్కడం జరిగింది. ఇద్దరు చాలాసేపు ట్రైన్ లో ముచ్చటించుకున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ అలసిపోయాడేమో కానీ హీరోయిన్ అనన్య పాండే ఒడిలో పడుకోవడం జరిగింది.
తన ఒడిలో విజయ్ దేవరకొండ కోరుకున్న ఫోటోని అనన్య పాండే సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. కాగా అంతకుముందు “కాఫీ విత్ కరణ్” షోలో విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే పాల్గొన్నారు. ఆ షోలో చాలావరకు బోల్డ్ ఆన్సర్ లు విజయ్ దేవరకొండ ఇవ్వటం జరిగింది. హీరోయిన్ అనన్య పాండే కూడా ఇదే తరహాలో సమాధానం ఇచ్చింది. “లైగర్” కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు వరుస పెట్టి జరుగుతున్నాయి. ముంబైలో జరుగుతున్న ఈ ప్రమోషన్ కార్యక్రమాలు.. సహ నిర్మాత కరణ్ జోహార్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!