“అర్జున్ రెడ్డి” సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా ఇండస్ట్రీ లోనే ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. హీరో విజయ్ దేవరకొండ కూడా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనాలకు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలు…. సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయాలని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ ఎవరితో చేస్తారు అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి మకాం మార్చేశాడు.
“అర్జున్ రెడ్డి” సినిమా ని “కబీర్ సింగ్” గా తెరకెక్కించి షాహిద్ కపూర్ కి మర్చిపోలేని హిట్ ఇచ్చాడు. ఇటువంటి తరుణంలో నెక్స్ట్ సినిమా కూడా బాలీవుడ్ లోనే రన్ బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ రన్ బీర్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తవ్వాలంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉండటంతో…. ఈలోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోల తో సినిమా చేయాలని ప్లాన్ చేశారట.
పరిస్థితి ఇలా ఉండగా సందీప్ రెడ్డి వంగ సినిమా కథ చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్న ఇండస్ట్రీలో టాప్ హీరోలైన పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా పెద్దగా అవకాశం ఇవ్వటం లేదని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం చూస్తే అతడు చెప్పే ప్రతీ కథా పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నాయి అని టాక్. దీంతో అంతా బడ్జెట్ సినిమాలు ఇలాంటి సమయంలో అనవసరమని.. సందీప్ రెడ్డి వంగ నీ పక్కన పెడుతున్నారని ఇండస్ట్రీలో టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!