Vrinda Dinesh: వచ్చే ఏడాది మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ నేపథ్యంలో శనివారం ముంబాయిలో జరిగిన వేలంలో 22 ఏళ్ల భారతీయ క్రీడాకారిణి వృందా దినేష్ ను యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. వృందా దినేష్ ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడకపోయినా ఈ క్రీడాకారిణిని డబ్ల్యూపీఎల్ ఆక్షన్ లో యూపీ వారియర్స్ రూ.1.3 కోట్లకు కొనుగోలు చేయడంపై ఇంతకూ వృందా దినేష్ ఎవరు అని క్రీడాభిమానులు గమనిస్తున్నారు.
వృందా కర్ణాటక రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి. రైట్ హ్యాండ్ బ్యాటర్ గా పేరుంది. ప్రస్తుతం సౌత్ జోన్ ఇండియా ఏ టీమ్ కు ఆడుతోంది. జాతీయ సీనియర్ జట్టుకు అడుగు దూరంలో నిలిచిన వృందా దినేష్ భారీ షాట్లు అడగల నైపుణ్యం ఉంది. ఈమె కొంత కాలంగా వివిధ టోర్నీల్లో నిలకడ ప్రదర్శిస్తొంది.
నిజానికి వృందా ఎసీసీ ఎమర్జింగ్ టీమ్ కప్ కు ఎంపిక కాలేదు కానీ ఎస్ యశశ్రీకి బదులుగా ఫైనల్స్ లో మొదటి సారి పోటీకి లోకి 29 బంతుల్లో 36 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సీనియర్ మహిళల ఓడిఐ టోర్నీ ఫైనల్ లో కర్ణాటక జట్టు గెలుపునకు కీలక పాత్ర పోషించింది. రాజస్థాన్ పై 81 పరుగుల తేడాతో విజయం సాధించారు. 11 ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేసి సగటు రన్ రేట్ 47.70 కలిగి ఉంది.
కాగా, ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ కు జాక్ పాట్ తగిలింది. సదర్లాండ్ ను రూ.2 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. బేస్ ప్రైస్ రూ.40 లక్షలతో వేలంలోకి వచ్చిన ఈ యువ ఆల్ రౌండర్ ను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. చివరికి ముంబై వెనక్కు తగ్గడంతో అన్నాబెల్ ను ఢిల్లీ సొంతం చేసుకుంది.