తిరుమల బ్రహ్మోత్సవాలలో శ్రీమలయప్పస్వామి వారు ఐదోరోజు గరుడ వాహనంలో దర్శనమిచ్చారు. ఆ విశేషాలు తెలుసుకుందాం…
ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీమహావిష్ణువు తన దివ్యమంగళ రూపాన్ని దర్శించే అవకాశం కల్పిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామి తెలియజేస్తున్నారు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తకోటికి తెలియజెప్పడమే ఈ వాహనసేవ అంతరార్థం.