Allu Arjun Ram Charan: డిసెంబర్ 25వ తారీకు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ఒకటి. ఈ పండుగను చాలామంది సెలబ్రిటీలు చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ రకంగానే మెగా ఫ్యామిలీ క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటుంది. గత ఏడాది పండుగనాడు అందరూ ఒకే చోట కలుసుకొని సందడి చేశారు. ఇక ఈ ఏడాది కూడా డిసెంబర్ 25 నాడు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ సభ్యులు… పండుగను జరుపుకోవడం జరిగింది. యంగ్ హీరోలతోపాటు కజిన్స్ అందరు ఒకే చోట చేరారు. మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ పండుగ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం జరిగింది. అంతేకాదు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక, ఉపాసన, అల్లు స్నేహ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, అల్లు శిరీష్, శ్రీజ, సుస్మిత తదితరులు ఉన్నారు. మెగా ఫ్యామిలీలో మనస్పర్ధలు ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చరణ్ పుట్టినరోజుకు మరియు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు అల్లు అర్జున్ విషెస్ చేయకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. అయితే వస్తున్న ఈ వార్తలకు క్రిస్మస్ వేడుకలకు సంబంధించి చరణ్ మరియు బన్నీ పక్కపక్కన ఫోటోలలో కనిపించడంతో… ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.
చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ మరియు బన్నీ ఒకే చోట కనిపించడంతో మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోపక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!