టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం జక్కన్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో పాటు కాస్టింగ్ ఎంపికలో బిజీగా ఉన్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే ఈ చిత్రంలో మహేష్ కు విలన్ గా ఓ స్టార్ హీరో కనిపించబోతున్నాడట. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు కార్తీ.
కథ ప్రకారం సినిమాలో రెండు విలన్ క్యారెక్టర్స్ ఉంటాయట. అయితే అందులో ఒక పాత్ర కోసం కార్తీని సంప్రదించినట్టు జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న కార్తీని విలన్ గా చేసేందుకు జక్కన్న ఒప్పించగలుగుతాడా..? లేదా..? అన్నది చూడాలి.
కాగా, మహేష్ బాబు ప్రస్తుతం మాటలు మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
https://newsorbit.com/cinema/rajamouli-and-mahesh-babu-movie-budjet-details.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!