టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు పెళ్లి అయిపోయిందట. ఈ విషయాన్ని బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ స్వయంగా నోరు జారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జాన్వీ కపూర్ త్వరలోనే `మిలీ` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. నవంబర్ 4న ఈ సినిమా విడుదల కాపోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తనకు టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందంటూ మనసులో మాటను బయటపెట్టింది. అలాగే ప్రస్తుతం తాను ఎవరితోనో ప్రేమలో లేనని, సింగల్ అని వెల్లడించింది .ఈ క్రమంలోనే ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది.
`ఒకవేళ మీ స్వయంవరం జరిగితే.. అందులో ఏయే హీరోలు పాల్గొనాలి..?` అని హోస్ట్ ప్రశ్నించగా.. హృతిక్ రోషన్, రణ్ బీర్ కపూర్, టైగర్ ష్రాఫ్ అని చెప్పింది జాన్వీ కపూర్. రణ్ బీర్ కపూర్ కు పెళ్లయింది కాబట్టి ఇంకొకరి పేరు చెప్పమని హోస్ట్ కోరగా.. జాన్వీ ఆలోచనలో పడింది.
దాంతో విజయ్ దేవరకొండ పేరును హోస్ట్ సూచించగా.. జాన్వీ టక్కున ఆయనకు ప్రాక్టికల్గా ఇప్పటికే పెళ్లైపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, గత కొద్ది రోజుల నుండి విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్-రష్మికల రిలేషన్పై జాన్వీ అలా కామెంట్స్ చేసిందని టాక్ నడుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!