అమలా పాల్.. ఈ కేరళ కుట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా తమిళనాడులోని విల్లుపురం పోలీసులను ఆశ్రయించింది. మాజీ ప్రియుడు, ప్రొడక్షన్ పార్టనర్ భవీందర్ సింగ్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దర్శకుడు ఏ.ఎల్.విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. అతడితో మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే విడిపోయింది. ఆ తర్వాత భవీందర్ సింగ్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ 2018లో సంయుక్తంగా ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఈ క్రమంలోనే భవీందర్, అమలా పాల్ మధ్య పరిచయం ప్రేమగా మారింది.
పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ, నిర్మాణ సంస్థ లావాదేవీల వల్ల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో భవీందర్ సింగ్ కు అమలాపాల్ దూరంగా ఉంటో వస్తోంది. అయితే ఇప్పుడు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోగా.. డబ్బులు అడిగితే ప్రైవేట్ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించసాగాడట.
భవీందర్ సింగ్ తో పాటు అతడి స్నేహితులు కూడా అమలాపాల్ పై లైంగిక వేధించడం ప్రారంభించారట. ఈ నేపథ్యంలోనే చేసేదేమి లేక అమలా పాల్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు భవీందర్తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్ట్ చేశారు. మిగతా పదకొండు మంది కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!