ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ గురించి పరిచయాలు అవసరం లేదు. వైజయంతీ మూవీస్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. రీసెంట్గా విడుదలైన `సీతా రామం` కూడా ఆయన బ్యానర్ లో నిర్మితమైన చిత్రమే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ అందమైన ప్రేమ కావ్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సూపర్ హిట్గా నిలిచింది.
`సీతారామం` సక్సెస్ నేపథ్యంలోనే నిర్మాత అశ్వినీ దత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇప్పుడు వందల కోట్లతో సినిమాలు నిర్మిస్తున్న తాను.. కెరీర్ ఆరంభంలో రూ. 16 లక్షలతో సినిమా తీశానని గుర్తు చేసుకున్నారు.
`జగదేక వీరుడు అతిలోక సుందరి – 2` సినిమా తీసి తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడతానని పేర్కొన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమా వల్ల రూ. 12 కోట్లు నష్టపోయామని కూడా అశ్వినీ దత్ ఓపెన్ నే కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ సినిమా మరెదో కాదు.. `చూడాలని వుంది`. చిరంజీవి, సౌందర్య జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దున్న చిత్రమిది.
అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో కలిసి హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారట అశ్వినీ దత్. `చూడాలని ఉంది` సినిమాను హిందీలో రీమేక్ చేశానని.. దాని వల్ల చెరో రూ. 6 కోట్లు పోగొట్టుకున్నామని ఆశ్వినీ దత్ తాజా ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!