Pallavi Prashanth: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కొద్దిసేపటి క్రితం చంచల్ గూడ జైలు నుండి విడుదల కావడం జరిగింది. హైదరాబాద్ చంచాల గూడ జైలు నుండి విడుదలైన వెంటనే నేరుగా ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. గత ఆదివారం డిసెంబర్ 17 బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన దాడుల కేసులో పల్లవి ప్రశాంత్ నీ ప్రధాన ముద్దయిగా పోలీసులు చేర్చి అరెస్టు చేయడం జరిగింది. దీంతో న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ తరుపున లాయర్లు.. హైదరాబాదు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
అయితే శుక్రవారం సాయంత్రమే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో జైలు టైమింగ్స్ వేరు కావడంతో.. ప్రశాంత్ సాయంత్రం విడుదల కావాల్సి వచ్చింది. అరెస్టయినా 48 గంటల్లో బెయిల్ వచ్చేలా కోర్టులో.. పేరుగాంచిన లాయర్లు వాదించారు. ఈ విషయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ భోలే ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం విశేషం. దాదాపు 15 వేల రూపాయల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీలతో ఈ బెయిల్ లభించింది. అంతేకాదు కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించడం జరిగింది.
దీంతో కుటుంబ సభ్యులు మరియు పల్లవి ప్రశాంత్ అభిమానులు… ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తరువాత.. అన్నపూర్ణ స్టూడియో బయట అల్లరిమోకలు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై దాడులు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సుల అద్దాలు ద్వంసం అయ్యాయి. అంతేకాదు పోలిస్ వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో పోలీసులు ర్యాలీలు చేయొద్దని కంటెస్టెంట్స్ కి తెలియజేయగా ప్రశాంత్ ఈ విషయంలో మొండిగా వ్యవహరించడంతోపాటు కారు ముందుకు వెళ్లిపోయినా కానీ మళ్ళీ వెనక్కి వచ్చే ర్యాలీ చేయడంతో పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!