కలర్స్ స్వాతి ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ్ మలయాళ భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు.. పెళ్లి తర్వాత నటనకు దూరమైంది. అయితే నటనపై ఉన్న మక్కువతో ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా కలర్స్ స్వాతి ప్రముఖ టాలెంటెడ్ హీరో నవీన్ చంద్రకు వార్నింగ్ ఇచ్చిందట. వీరిద్దరూ గతంలో `త్రిపుర` అనే సినిమాలో నటించారు. వీరిద్దరికీ మంచి సన్నిహిత్యం ఉంది. అలాంటిది స్వాతి ఎందుకు నవీన్ చంద్రకు వార్నింగ్ ఇచ్చింది అనేగా మీ డౌట్? అక్కడికే వస్తున్నా.. నవీన్ చంద్ర తాజా చిత్రం `అమ్ము` ఓటీటీ వేదికగా విడుదలైంది.
ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తే.. బాబీసింహ కీలక పాత్రను పోషించాడు. గృహహింస అనే చిన్న ఎలిమెంట్తో చారుకేష్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నవీన్ చంద్ర ఒక శాడిస్ట్ భర్తగా నటించాడు. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోకు హాజరైన కలర్స్ స్వాతి.. సినిమా చూసిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
“అమ్ము సినిమా చూశాను. కథ, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నవీన్ మన ఇండస్ట్రీకి దొరికిన జెమ్ లాంటి వాడు. ఈ సినిమాలో అతడు పోషించిన శాడిస్ట్ పాత్రను చూసి షాక్ అయ్యాను. ఆయనను చూడాలంటేనే నాకు భయం వేసింది. ఇంటర్వెల్ లో నవీన్ వచ్చి నాతో మాట్లాడబోతుంటే .. ఆ సినిమా మూడ్ లోనే ఉన్న నేను, `నాతో మాట్లాడకు .. ఇక్కడి నుంచి వెళ్లిపో` అని చెప్పేశాను“ అంటూ కలర్ స్వాతి నవ్వుతూ చెప్పుకొచ్చింది. మొత్తానికి అలా సినిమాలోని శాడిస్ట్ బిహేవియర్ చూసి నచ్చక నవీన్ చంద్రకు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది.
https://newsorbit.com/news/why-colours-swathi-fade-out-from-industry.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!