Nagarjuna The Ghost: కింగ్ నాగార్జున ఈ ఏడాది ఆరంభంలోనే `బంగార్రాజు` చిత్రంలో ప్రేక్షకులను పలకరించి బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడీదే జ్యోష్లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన `ది ఘోస్ట్` శరవేగంగా కంప్లీట్ చేసుకున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తోంది.
ముందుగా కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. కానీ, ప్రెగ్నెన్సీ రావడంతో ఆమె ఘోస్ట్ నుంచి తప్పుకుంది. దాంతో కాజల్ స్థానంలో సోనాల్ను తీసుకున్నారు. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికే అరవై శాతం షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. మిగిలిన భాగాన్ని సైతం మేకర్స్ త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. `ది ఘోస్ట్` ను థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే ఆ వార్త సారాంశం.
ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మంచి రేటు ఆఫర్ చేసిన నేపథ్యంలో మేకర్స్ ఓటీటీ విడుదలకు మొగ్గు చూపుతున్నారని, ఈ విషయంపై నాగార్జున సైతం సుముకత వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో రిలీజ్ ఉంటుందని కూడా టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే.. చిత్ర టీమ్ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!