Bigg Boss 7 Telugu Weekend Special: శుక్రవారం అర్ధరాత్రితో నాలుగో వారం బిగ్బాస్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్లో ప్రిన్స్ యావర్ మొదటి స్థానంలో ఉన్నాడు. కానీ, గురువారం రాత్రి నుంచి గౌతమ్ కృష్ణ టాప్లో వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఓటింగ్ వ్యత్యాసం తక్కువే ఉన్నప్పటికీ.. బెల్ట్ టాస్క్లో గౌతమ్ కృష్ణ పట్ల టేస్టీ తేజ మరీ క్రూరంగా ప్రవర్తించాడు. దాంతో గౌతమ్ కృష్ణపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. అలాగే గత రెండు రోజులుగా గౌతమ్ కృష్ణ పర్ఫార్మెన్స్ పరంగా అదరగొడుతున్నాడు. శుభ శ్రీ కూడా మెరుగైనా ఆటను ఆడుతోంది. ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది. నాలుగో స్థానంలో ప్రియాంక జైన్ ఉంది. అయితే ఈ వారం ఓటింగ్లో టేస్టీ తేజ, రతిక రోజ్ డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లిద్దరూ ఎలిమినేషన్లో ఉన్నారు. నిన్న జరిగిన టాస్క్లో గౌతమ్ కృష్ణ పట్ల టేస్టీ తేజ ప్రవర్తించిన విధానంతో అతడిపై నెగిటివిటి పెరిగిపోయింది. దాంతో అతని ఓటింగ్పై దెబ్బపడింది. అలాగే రతిక రోజ్ మీద కూడా వ్యతిరేకత ఉంది. దాంతో ఈ సారి డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి.
పల్లవి ప్రశాంత్కు పవరస్త్ర..
నాలుగో వారంలో పవరస్త్రను గెలిచి రెండు వారాల ఇమ్యూనిటీతోపాటు ఇంటి సభ్యుడిగా నిలవడానికి పోటీదారులైన యావర్, ప్రశాంత్, శుభ శ్రీకి బిగ్బాస్ టాస్క్ ఇచ్చాడు. ‘పట్టు వదలకు డింభకా’ అనే టాస్క్లో భాగంగా పవరస్త్రని ముగ్గురు పోటీదారులు పట్టుకునే ఉండాలి. చివరి వరకు ఎవరైతే పవరస్త్రను పట్టుకుని ఉండారో వాళ్లే నాలుగో వారంలో పవరస్త్రను సాధిస్తారని బిగ్బాస్ చెప్తాడు. ఈ టాస్క్కి శివాజీని సంచాలకుడిగా నియమిస్తారు. అయితే సంచాలకుడిగా శివాజీని బిగ్బాస్ నియమిస్తాడో.. అప్పుడే అమర్ దీప్ ముఖం మాడిపోయింది. ఎక్కడ ప్రశాంత్ని గెలిపిస్తాడేమోననే భయం పుట్టుకొచ్చింది. కానీ చివరకు పవరస్త్రను పల్లవి ప్రశాంతే గెలుస్తాడు.
రెచ్చిపోయిన రతిక..
ఒక చేతితో పవరస్త్రను పట్టుకుని ఉండాలని బిగ్బాస్ చెప్తాడు. అయితే పోటీదారులను తాకకుండా కంటెస్టెంట్స్ డిస్టర్బ్ చేయవచ్చని బిగ్బాస్ చెప్తాడు. దాంతో ప్రశాంత్ను ఓడించేందుకు అమర్ దీప్ తెగ ప్రయత్నిస్తాడు. రతికను ఉసిగొల్పుతాడు. ప్రశాంత్కు బండబూతులు తిడుతూ రతిక రెచ్చిపోతుంది. వాళ్లు ఎన్ని మాటలు అన్నా ప్రశాంత్ మౌనంగానే ఉండిపోయాడు. అయితే పోటీదారులు ఒకరినొకరు కన్వెన్స్ చేసుకోవచ్చని బిగ్బాస్ ఆఫర్ ఇస్తాడు. కానీ ముగ్గురిలో ఎవరూ కన్వెన్స్ అవ్వరు. దాంతో బిగ్బాస్ ఆ టాస్క్ను రద్దు చేసి వేరే టాస్క్ ఇస్తాడు.
కదలకురా.. వదలకురా..
బిగ్బాస్ ‘కదలకురా.. వదలకురా..’ అనే టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్లో ప్రశాంత్, శుభ శ్రీ, యావర్ పోటీ పడతారు. అయితే ఈ టాస్క్కు కూడా సంచాలకుడిగా శివాజీని నియమిస్తారు. పోటీలో మొదటగా పాల్గొన్న యావర్.. పవరస్త్రను కింద పడేస్తాడు. దాంతో అతను ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవుతాడు. శుభ శ్రీ కూడా ఈ టాస్క్లో ఓడిపోతుంది. చివర్లో పోటీలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ టాస్క్లో గెలుపొందుతాడు. దాంతో పల్లవి ప్రశాంత్ను విన్నర్గా ప్రకటించిన బిగ్బాస్ రెండు వారాల ఇమ్యూనిటీని అందిస్తుంది.
శివాజీ కాళ్లు మొక్కిన ప్రశాంత్..
పవరస్త్రను గెలిచిన ఆనందంలో పల్లవి ప్రశాంత్.. శివాజీ కాళ్లు మొక్కాడు. అప్పుడు శివాజీ.. పల్లవి ప్రశాంత్కు హితబోధ చేశాడు. ‘జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎన్ని మాటలు నెగిటివ్గా చెప్పినా.. నవ్వుతూ ఉండాలి. నువ్వు బిగ్బాస్ హౌస్లోని గెలవడానికి వచ్చావు. గేమ్లా ఆడు.. దాని కోసం శ్రమించు’ అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న అమర్ దీప్, రతిక లోలోపల మండిపోయారు. మొదటి నుంచి పల్లవి ప్రశాంత్ ఓటమి కోసం శ్రమించిన వీరిద్దరు.. అతడి గెలుపును జీర్ణించుకోలేకపోయారు. ప్రశాంత్ గెలుపుతో హౌస్లో వాతావరణం మరింత హీటెక్కిందని చెప్పవచ్చు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!