Priyamani: హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2003వ సంవత్సరంలో “ఎవరే అతగాడు” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. అతి తక్కువ కాలంలోనే సూపర్ విజయాలు తన ఖాతాలో వేసుకుంది. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో “పెళ్లయిన కొత్తలో” అనే సినిమాతో జగపతిబాబు సరసన నటించి.. మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన “యమదొంగ” సినిమాలో హీరోయిన్ గా చేసి బ్లాక్ బస్టార్ విజయం సాధించడం జరిగింది.
అప్పటివరకు తెలుగింటి అమ్మాయి లాగా పద్ధతిగా సినిమాలు చేసిన ప్రియమణి నితిన్ తో “ద్రోణ” సినిమాలో గ్లామర్ డాల్ అవతారం ఎత్తింది. ఈ సినిమాలో బికినీ వేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మిత్రుడు ఇంకా రకరకాల సినిమాలు చేసి అందరి ప్రశంసలు పొందింది. ఒకపక్క స్టార్ హీరోల పక్కన నటిస్తూనే మరోపక్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయడం జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ప్రియమణి ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేసింది. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్న ప్రియమణి కొన్నాళ్లు సినిమాలకు విరామం ప్రకటించడం జరిగింది.
అనంతరం టెలివిజన్ షోలలో మెప్పించి ఇటీవల మళ్ళీ వెబ్ సిరీస్ ఫుల్.. సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. కాగా ప్రియమణి నటించిన “భామ కలాపం 2” ఈనెల 16న ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా..ప్రమోషన్ కార్యక్రమాలలో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. “నారప్ప” సినిమాతో వెంకటేష్ తో నటించాలన్న కోరిక తీరింది అన్నారు. నాన్ స్టాప్ గా నవ్వించే పాత్రను ఎప్పటినుంచో చేయాలని ఉందన్నారు. దీంతో పాటు పవర్ ఫుల్ విలన్ రోల్ చేయాలనే కోరిక బలంగా ఉందన్నారు. అటువంటి రోల్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు.. బహిరంగంగా ఓపెన్ గానే నెగటివ్ పాత్రలు చేయడానికి తనకేమి మొహమాటం లేదని ప్రియమణి తెలియజేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!