Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ షోపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం ఏడు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఆరో సీజన్ నుండి షో మీద రకరకాలుగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సిపిఐ నారాయణ అయితే షో ఆపేయాలని న్యాయస్థానాలలో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇటీవల సీజన్ సెవెన్ కంప్లీట్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట గొడవలు జరగడం తెలిసిందే. సీజన్ సెవెన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నీ ప్రకటించటంతో బయట ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
షోలో పల్లవి ప్రశాంత్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన కంటెస్టెంట్లతో పాటు మరి కొంతమందిపై బయట దాడులు జరగడం తెలిసిందే. ఈ దాడులలో వారి వాహనాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా షో నుండి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ర్యాలీగా బయలుదేరడం జరిగింది. అప్పటికే దాడులు చోటు చేసుకోవడంతో పోలీసులు ప్రశాంత్ నీ ర్యాలీగా వెళ్లొద్దని సైలెంట్ గా వెళ్ళిపోవాలని సూచించారు. అయినా గాని పోలీసుల ఆదేశాలను పాటించకుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ పరిణామంతో అన్నపూర్ణ స్టూడియో బయట దాడులు చేసింది చాలావరకు ప్రశాంత్ అభిమానులు అంటూ ప్రచారం జరిగింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ మరియు అతని సోదరునిపై కేసులను నమోదు చేయడంతో పాటు మరో పదహారు మందిని అరెస్టు చేశారు.
షో బయట దాడులు జరుగుతున్న సమయంలో… ఆర్టీసీ బస్సులు ధ్వంసం కావడంతో పాటు పోలీస్ వాహనాలు కూడా డామేజ్ అయ్యాయి. వాహనాలపై దాడులు మరియు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కావటంతో ఈ విషయంలో వివరణ ఇవ్వాలని తాజాగా బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. షో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే గొడవలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ కేసులలో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ నాలుగు రోజులపాటు చంచల గూడా జైలులో గడపటం జరిగింది. ఆ తర్వాత కోర్టు పదిహేను వేల రూపాయల పూచికాతతో ఇద్దరు షూరిటీలతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!