బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ పెళ్లి పీటలెక్కబోతోందట. బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమలో ఉందంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను ఇటు కియారా కానీ.. అటు సిద్ధార్థ్ కానీ ఖండించలేదు. దీంతో అభిమానులు సైతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని బలంగా నమ్ముతున్నారు.
పైగా ఇద్దరు ఈ ఏడాది ప్రారంభంలో సీక్రెట్గా మాల్దీవులకు వెళ్లిడం, పలు మార్లు కియారా సిద్దార్థ్ ఇంటి దగ్గర కెమెరాలకు చిక్కడంతో వీరిపై ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ జంట ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఇరు కుటుంబ సభ్యులు సైతం వీరి పెళ్లికి అంగీకారం తెలిపారట. డిసెంబర్లో కియారా సిద్ధార్థ్ ల వివాహం జరగబోతోందని తెలుస్తోంది. గుజరాత్ లోని ఒబేరాయ్ సుఖ్ విల్లా స్పా రిసార్ట్ వీరి పెళ్లికి వేదిక కానుందని ప్రచారం జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు మరియు అది కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంగా వీరి వివాహం జరగబోతోందట.
ఇప్పటికే ఢిల్లీలోని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కోసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకొన్నారట. అలాగే పెళ్లి పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఇక అతి త్వరలోనే ఈ జంట తమ పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!