సినీ నటుడు, రాజకీయ నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఆయన అంత్యక్రియలు నేడు ముగిశాయి. మొయినాబాద్ లోని కనకమామిడి ఫాంహౌస్ లో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇకపోతే కృష్ణంరాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఆయనకు సీతాదేవితో వివాహం జరిగింది. యితే 1995లో సీతాదేవి కారు ప్రమాదంలో కన్నుమూశారు.
ఆమె మరణంలో ఒంటరి వాడైన కృష్ణంరాజుకి ఏడాది తర్వాత 1996 సెప్టెంబర్ 20న శ్యామలాదేవితో పెద్దలు రెండో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే వారి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అసలు వారు పేర్లు ఏంటీ..? వారు ఏమేం చేస్తున్నారు..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్ద కుమార్తె పేరు సాయి ప్రసీద. ఈమె లండన్ లో ఎంబీఏ చదివారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన `రాధేశ్యామ్` సినిమాతో నిర్మాతగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. కృష్ణం రాజు స్థాపించిన `గోపీకృష్ణ మూవీస్` నిర్మాణ సంస్థని ఈమే చూసుకుంటోంది. రెండో కుమార్తె అయిన సాయి ప్రకీర్తి హైదరాబాదులోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చదువుతున్నారు. మూడో అమ్మాయి సాయి ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. వీరు ముగ్గురు కేరీర్ లో మంచి పోజిషిన్ కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, వీరిలో ఎవరి పెళ్లి కూడా చూడకుండానే కృష్ణంరాజు మృతి చెందడం బాధాకరం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!