టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం తెరకెక్కించిన చిత్రమిది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ మూవీని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్, పూరీ జగన్నాథ్ కలిసి నిర్మించారు.
ఇందులో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ, వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేస్తుంది.
ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు లైగర్ చిత్రానికి క్లీన్ యూఏ సర్టిఫికెట్ జారీచేసినట్లు లేటెస్ట్ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇంతకీ ఈ మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా.. 2 గంటల 20 నిమిషాలు. అవును, సినిమా రన్ టైమ్ రెండు గంటల 20 నిమిషాలుగా ఖరారైంది.
ఇటీవల కాలంలో సినిమా నడివి ఎక్కువ లేకపోవటం చాలా ప్లస్ అవుతోంది. అందుకే పూరీ తక్కువ రన్ టైమ్ను సినిమాను క్రిస్పీగా చూపించబోతున్నారట. కాగా, విజయ్ దేవరకొండ తన కెరీర్లోనే తొలిసారి బాక్సర్గా చేస్తున్న చిత్రమిది. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. నార్త్ సినీ ప్రియులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!