Madhuranagarilo April 11 2024 Episode 335: రాజి వంటలు చేసావా అని అడుగుతాడు.అన్ని కూరలల్లో ఉప్పు కారం ఎక్కువ వేసి చేశాను అయ్యగారు అని చెప్తుంది రాజీ. ఒకసారి తిని చూద్దాం అని అతను తింటాడు. చాలా బాగా చేశావు నేను చెప్పినట్టు చాలా చండాలంగా చేసావు అని అతను అంటాడు. వంటలు ఇంత చండాలంగా చీమ ఎందుకు చెప్పారు అయ్యగారు అని అడుగుతుంది రాజి. నా కొడుకు ఇలాంటి వంటలన్నీ తినలేక పెళ్లి చేసుకుంటాడని చేయించాను అని అంటాడు అతను. ఇంతలో అతనికి కొడుకు వచ్చి భోజనం వడ్డించండి అని అనగానే వడ్డిస్తుంది రాజి అతను తింటాడు.మీరు ఒక ఆవిడ ఉద్యోగం కోసం వస్తుందని చెప్పారు కదా తను రాలేదు ఎందుకు అని అడుగుతాడు. పని కోసం తన తప్పకుండా వస్తుంది అని అంటాడు. వంటలన్నీ ఎలా ఉన్నాయి అని అడుగుతుంది రాజి.
వంటలు అద్భుతంగా ఉన్నాయి నీకు నేను జీతం పెంచుతాను అని అంటాడు అతను. కూరలలో ఉప్పు కారం ఎక్కువైంది అది మానేసి తనకి జీతం పెంచుతాను అంటావేంటి అని అంటాడు వాళ్ళ నాన్న. మీరు కావాలనే రాజీ చేత ఇలాంటి వంటలు చేయించారని నాకు తెలుసు వంటలు చండాలంగా ఉన్నాయి అంటే మీరు పెళ్లి చేసుకో నీ భార్య వంటలు చక్కగా చేసి పెడుతుందని మీరు అంటారు అని విరాజ్ అంటాడు. నేను మాత్రం చచ్చినా పెళ్లి చేసుకోను అని విరాజ్ అంటాడు. నేను చచ్చిన నువ్వు చేసుకోవా? కోడలు పిల్ల ఇంట్లో కలకలాగా తిరుగుతూ ఉండాలని నాకు ఉండదా నా వంశం నిర్వంశం కాకూడదని నాకు ఉండదా ఇవన్నీ చూస్తూ నేను చచ్చి పోవాలా అని అరుస్తుండగా అతనికి గుండె నొప్పి వస్తుంది.
విరాజ్ తనకి టాబ్లెట్ వేసి పడుకోబెడతాడు. నాన్న ఎలాంటి విషయాల గురించి ఆలోచించకుండా ఎలాంటి టెన్షన్ పడకుండా నువ్వే చూసుకోవాలి అని విరాజ్ రాజికి చెబుతాడు. కట్ చేస్తే, హాస్పిటల్లో పండుకి ట్రీట్మెంట్ జరుగుతుంది రాధ ఏడుస్తూ కూర్చుంటుంది. రాధా వెళ్లి డాక్టర్ ని మా పండు స్పృహలోకి వచ్చాడా అని అడుగుతుంది. బాబు పరిస్థితి చాలా కఠినంగా ఉంది లివర్ చాలా దెబ్బతిన్నది ఇంతవరకు వచ్చేలా ఎలా చేశారు అసలు ఈ విషయం తెలుసా లేదా అని అడుగుతుంది డాక్టర్.తెలుసు అని శ్యామ్ అంటాడు. తన తండ్రి ఉంటేనే ఆపరేషన్ చేయాలి అని మా డాక్టర్ చెప్పాడు అని అంటుంది రాధ. తన తండ్రి లేడా అని అడుగుతుంది డాక్టర్. తన తండ్రి నేనే అని శ్యామ్ చెప్తాడు. ఆపరేషన్ కి 25 లక్షలు కావాలి మీరు ఎంత త్వరగా డబ్బు తీసుకొస్తే అంత త్వరగా బాబుకి ఆపరేషన్ జరుగుతుంది తను త్వరగా కోలుకుంటాడు లేదంటే తనను మీరు కోల్పోవాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది.
25 లక్షలు కావాలి అని డాక్టర్ అంటున్నాడు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలి అని మధుర అంటుంది. డబ్బు తేవాలి పండుని కాపాడాలి అని ధనుంజయ్ అంటాడు. నేను డబ్బు తెస్తాను అని శ్యామ్ వెళ్లిపోతాడు. నేను కూడా వెళ్లి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రయత్నం చేసి వస్తాను అని రాధ వెళ్ళిపోతుంది. ఎక్కడ ప్రయత్నిస్తారండి అని అంటుంది మధుర.కట్ చేస్తే,రుక్మిణి రాధ కొట్టినదెబ్బలను గుర్తు తెచ్చుకొని వాళ్లను వదలడానికి వీల్లేదు నన్ను చెంప మీద కొడతారా ఆ రాధ శ్యామ్ అని రుక్మిణి అంటుంది. నువ్వేం తప్పు చేశావు నీ కొడుకు పుట్టినరోజు నువ్వు చేసావు నీకు అర్హత లేదా పండు తండ్రి శ్యామ్ ఒక్కడికే అర్హత ఉందా నిన్ను చెంప మీద కొట్టారు వాళ్లని వదలకూడదు అంతకుమించి ఏదో చేయాలి అని అంటుంది దాక్షాయిని. వాళ్లని ఏదో ఒకటి చేస్తాను అని వెళ్ళిపోతుంది రుక్మిణి. కట్ చేస్తే,శ్యామ్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి తనని డబ్బులు అడుగుతాడు. తన దగ్గర రెండు లక్షలు మాత్రమే ఉన్నాయి అని చెప్తాడు.
నేను చాలామందికి సహాయం చేశాను కానీ నాకు సహించడానికి మాత్రం ఎవరు రావట్లేదు వాళ్ళందరూ నా స్నేహితులు అనుకున్నాను అని శ్యామ్ బాధపడుతూ చెప్తాడు. మా ఊర్లో చుట్టాలు ఉన్నారు వాళ్ళు మనకెంతో కొంత సహాయం చేస్తారు ఇప్పటికైతే గండం కట్టుకుతుంది అని అంటాడు తన స్నేహితుడు. రాధ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళుతుంది కానీ అక్కడ వాచ్ మెన్ ప్రసాద్ కి ఆరోగ్యం బాలేదని చెప్తాడు. కట్ చేస్తే, శ్యామ్ హాస్పిటల్ కి వెళ్తాడు. డబ్బులు దొరికాయా శ్యామ్ అని అడుగుతుంది మధుర. లేదు దొరకలేదు నా ఫ్రెండ్ కూడా తన చుట్టాలని అడిగి చూసాడు ఎవరు ముందుకు రావడం లేదు ఒక రెండు మూడు అంటే చూస్తారు కానీ పాతిక లక్ష్యాలు అంటే కష్టమని చెప్తున్నారు అని అంటాడు శ్యామ్.
రాధ ఎక్కడ అని శ్యామ్ అడుగుతాడు. రాధ కూడా తనకు తెలిసిన వారిని డబ్బులు అడగడానికి వెళ్ళింది అని చెప్తుంది మధుర. ఇంతలో రాధ హాస్పిటల్ కి వస్తుంది. ప్రసాద్ గారిని కలిసి డబ్బులుఅడగడానికి వాళ్ల ఇంటికి వెళ్లాను అత్తయ్య కానీ వాచ్మెన్ లోపలికి వదల్లేదు చాలా అత్యవసరం అని చెప్పినా పంపించలేదు ఆయనకి ఒంట్లో బాగోలేదంట ఆయన పడుకున్నారు అంట అని చెప్తుంది రాధ. అయితే ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చే నాధుడే లేడా అని మధుర బాధపడుతుంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!