Madhuranagarilo March 5 2024 Episode 304: చూసావా రాదా మీ అక్కకి నామీద ఎంత ప్రేమ ఉందో అందుకే ఉపవాస దీక్ష బాగా పూర్తి చేస్తుంది అని శ్యామ్ అంటాడు. ఏంటక్కా ఇది అని రాదా అంటుంది. వాళ్ళను చూసి రుక్మిణికి పురమారుతుంది. ఇంకా లేట్ ఎందుకు రాదా మీ అక్కకు మంచినీళ్లు ఇవ్వు అని శ్యామ్ అంటాడు. రాధా వాళ్ళ అక్కకి మంచినీళ్లు ఇస్తుంది. రాధా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నాకు ఇంతకుముందు షుగర్ వచ్చింది ఉపవాసం ఉండకూడదు కానీ చెప్పలేకపోయాను శ్యామ్ కోసం కదా ఉండాలి అనుకున్నాను కానీ ఆకలికి తట్టుకోలేక తినేసాను అని రుక్మిణి అంటుంది. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అక్క రేపు మాట్లాడుకుందాం లే అంటూ రాధా వెళ్లిపోతుంది. ఇంకా ఆలస్యం దేనికి మిగతాది కానీ అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే,
మమ్మీ నాకు నిద్ర పట్టడం లేదు కథలు చెప్పవా అని పండు అంటాడు. పెద్దమ్మ అయితే బాగా చెప్తుంది నాన్న వెళ్లి అడుగు అని రాదా అంటుంది. అవును రా పండు మీ పెద్దమ్మ కథలు బాగా చెబుతుంది కట్టు కథలు కూడా అల్లుతుంది వెళ్లి చెప్పించుకో పో అని శ్యామ్ అంటాడు. పండు వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే, పెద్దమ్మ నువ్వు కట్టు కథలు బాగా చెప్తా వంట కదా నాకు కథ చెప్పవా అని పండు అడుగుతాడు. నేను కట్టు కథలు చెప్తానని మీ నాన్న అన్నాడు కదా చెప్తాను ఉండు మళ్ళీ జీవితంలో కథ చెప్పమని అడగకుండా చేస్తాను అని దయ్యాల కథ చెబుతుంది పండుకి.
ఆ దయ్యం కథ విన్నా పండు భయపడి పోయి పెద్దమ్మ నాకు కథ వద్దు ఏమి వద్దు పడుకుంటాను అని పడుకుంటాడు. కథ చెప్పాలా ఇక జీవితంలో నన్ను కాదా అడగవు అని రుక్మిణి పడుకుంటుంది. కానీ పండు మాత్రం భయపడుకుంటూనే పడుకుంటాడు మధ్య రాత్రి కళ వచ్చి పండు కి మెలకువ వస్తుంది. భయపడుతూ పండు లేచి అటు ఇటు చూసి పెద్దమ్మ టాయిలెట్ వస్తుంది రావా అని పిలుస్తాడు. పండు నాకు నిద్ర బాగా వస్తుంది పడుకో అని రుక్మిణి అంటుంది.
పండు భయపడుతూ రాధ దగ్గరికి వెళ్తాడు. వెళ్తున్న పండుని శ్యామ్ చూస్తాడు. పండు పండు అని పిలిచినా పండు పలకకుండా రాదా గదిలోకి వెళ్తాడు పండు. మమ్మీ మమ్మీ లే నాకు టాయిలెట్ వస్తుంది చాలా భయం వేస్తుంది అని పండు అంటాడు. ఏమైంది నాన్న అని రాధా అడుగుతుంది.పెద్దమని కథ చెప్పమంటే దెయ్యాల కథ చెప్పింది నాకు చాలా భయం వేసింది టాయిలెట్ వస్తుంది రా అంటే పడుకుండిపోయింది టాయిలెట్ పోసుకోవాలి రా మమ్మీ అని పండు అంటాడు. ఎందుకు భయపడుతున్నావ్ నాన్న నేనున్నానుగా వెళ్లి పోసుకుని రాపో అని రాదా అంటుంది. చూసావా రాదా? మీ అక్కకి నామీద ప్రేమ ఉందన్నావు ఉపవాస దీక్ష చెడగొట్టింది పండు మీద ప్రేమ ఉందన్నావు వాడికి దయ్యాల కథ చెప్పి భయపెట్టింది ఇదేనా మీ అక్క మా మీద చూపించే ప్రేమ అని శ్యామ్ అంటాడు. కొంతమంది పిల్లలు దయ్యాల కథలు అంటే ఇష్టపడతారు కాబట్టి చెప్పి ఉంటుందిలెండి అని రాదా అంటుంది.
మా అక్కకి నిజంగానే మీ మీద ప్రేమ ఉంది సార్ అని రాదా అంటుంది. అయితే రేపు మీ అక్కకి మా మీద ఎంత ప్రేమ ఉందో రెండవ టెస్ట్ పెడదాం అప్పుడు తెలుస్తుంది అని శ్యామ్ అంటాడు. మా అక్క ఆ టెస్ట్ లో కూడా పాస అవుతుంది మీద ప్రేమ ఉందని తెలియజేస్తుంది చూడండి అని రాధా అంటుంది. పండు నీకేం భయం లేదు నాన్న నేనున్నాను కదా నా దగ్గర పడుకో అని రాదా పండు నీ పడుకో పెడుతుంది. కట్ చేస్తే, రాధా పూజ చేస్తూ ఉంటుంది.నిన్న కూడా రాదా ఇలాగే పూజ చేసి నన్ను కటిక ఉపవాసం చేయమనింది. ఈరోజు కూడా పూజచేస్తుంది ఏం చేయమంటుందో నా ప్రేమని ఎలా నిరూపించుకోవాలి అని రుక్మిణి ఆలోచిస్తుంది. రఆక్క ఏంటి అక్కడే నిలబడి పోయావు అని రాదా పిలుస్తుంది. షుగర్ వల్ల నిన్న ఉపవాస దీక్ష విరమించావట కదమ్మా అని మధుర అంటుంది. షుగరు ఎప్పటి నుంచి వచ్చిందమ్మా నీకు అని చలపతి అంటాడు. ఈ మధ్యనే బాబాయ్ ఆయనకి గండం ఉందనే తెలిసిన కానించి టెన్షన్ మొదలైంది
అందుకే వస్తూపోతూ ఉంటుంది పెద్ద ప్రాబ్లం ఏమి లేదు అని రుక్మిణి చెబుతుంది. నువ్వేం టెన్షన్ పడకు రుక్మిణి ఏదో ఒక పూజ వల్ల శ్యామ్ కి ఉన్న గండం తప్పిపోతుంది నువ్వు టెన్షన్ పెంచుకో కమ్మ అని మధుర అంటుంది. రాధా నిన్న ఉపవాస దీక్ష విరమించినందుకు మీ అక్క చేత హస్త హారతి ఇప్పిస్తానన్నావు కదా అని శ్యామ్ అంటాడు. హస్త హరత అంటే ఏంటి అని రుక్మిణి అంటుంది. అంటే చేతిలో కర్పూరం పెట్టుకొని వెలిగించి భగవంతుడికి హారతి ఇవ్వాలి అని శ్యామ్ అంటాడు. మా అక్క హస్త హారతి ఇస్తుంది నీ మీద ప్రేమ ఎంత ఉందో చూపెడుతుంది అని రాదా అంటుంది. అవునా అయితే రా రుక్మిణి చేయిపట్టు హారతి ఇద్దువు గాని అని శ్యామ్ రుక్మిణి చేతిలో హారతి కర్పూరం పెడతాడు.ఇప్పుడు ఈ హారతి ఇచ్చి నా ప్రేమని తెలియజేసుకోవాలా ఇలా ఇరుక్కుపోయాను ఏంట్రా అని రుక్మిణి మనసులో అనుకుంటుంది..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!