Malli Nindu Jabili March 5 2024 Episode 589: తలలో పువ్వులు పెడుతుంది మల్లి. ఇది అక్క నీ జీవితం ఇలాగే ఉండాలి దేవుడు ముందు నీకు ఇలా అలంకరణ చేశాను ఇకమీదట నిన్ను ఎవరు ఏమీ అనరు నువ్వు సుమంగళివి ఏ పూజ కైనా వెళ్లొచ్చు ఏ వ్రతానికి అయినా వెళ్లొచ్చు ఎవరు ఏమీ అనరు అని మల్లి అంటుంది. అదంతా దూరం నుంచి చూసినా వసుంధర ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఏదో ఒక రోజు అరవింద్ బాబు గారు నీ కళ్ళ ముందుకు వస్తారు అక్క నీ గత జీవితం మళ్ళీ నీకు తిరిగి వస్తుంది అని మల్లి అంటుంది.కట్ చేస్తే,వసుంధర అమ్మగారు మాలిని అమ్మగారు ఇంకెప్పుడు మమ్మల్ని అర్థం చేసుకుంటారు బాబు ఎప్పుడూ అపార్థం చేసుకుంటూనే ఉన్నారు అని మీరా బాధపడుతుంది. ఇంతలో వసుంధర ఇంటికి వస్తుంది.ఎక్కడికి వెళ్లావు సుందర అని శరత్ అడుగుతాడు. ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళుతుంది వసుంధర.
అడుగుతుంది నిన్నే వసుంధర ఎక్కడికి వెళ్లావు అని శరత్ అంటాడు. మాలిని అమ్మ పొద్దున అనంగా గుడికి వెళ్ళింది ఇంకా తిరిగి రాలేదు బాబు అని శంకరమ్మ చెబుతుంది. ఇంతలో మాలిని నిండు ముత్తైదువు లాగా తల నిండా పూలు చేతికి గాజులు మొహానికి బొట్టు పెట్టుకుని ఇంటికి వస్తుంది. మాలిని చూసి షాక్ అయిపోతారు. మాలిని అమ్మగారు అలా వస్తున్నారు అంటే అరవింద్ బాబు గారు బతికే ఉన్నారని నమ్ముతున్నారని మాట అని మీరా అంటుంది. మాలిని అమ్మ ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు నిండుగా ఉన్నారు ఎంత బాగున్నారు అని మీరా పొగుడుతుంది. మాలిని తలలో పూలు తీసేస్తూ ఉంటుంది. మాలిని అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నారు అని మీరా అడుగుతుంది. మామ్ మల్లి ఇదంతా ఎందుకు చేసిందో నాకు తెలియదు అని మాలిని బాధపడుతుంది. అర్థం కాకపోవడానికి ఏముంది బేబీ మల్లి కావాలని ఇదంతా చేసింది గౌతమ్ మీద కేసు పెట్టావని అది గౌతమ్ ని తప్పించడానికి ఇలా చేసి ఉంటుంది
అని వసుంధర అంటుంది. మల్లి ఇలా ఎందుకు చేసిందో తెలియదు కానీ అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడని మల్లి నమ్ముతుంది దానితోపాటు నేను కూడా నమ్ముతున్నాను అరవింద్ బాబు నిజంగానే చనిపోలేదమ్మా ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంటారు అందుకే మల్లి ఇలా చేసి ఉంటుంది అని మీరా అంటుంది. ఆపవే నిన్నాంగా మాటలు నీ అల్లుడు మీద కేసు మాలిని పెట్టింది కావాలని మల్లి ఇదంతా చేసింది అని వసుంధర అంటుంది. మల్లి చేసింది ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు ఏదో ఒకరోజు అరవింద్ బాబు మీ కళ్ళ ముందుకి వచ్చినా రోజు మల్లి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న తక్కువే అవుతుంది అని మీరా అంటుంది. అలాగనిక జరిగితే నువ్వు చెప్పినట్టే మల్లి కాళ్లు కడుగుతాను అని మాలిని అంటుంది. ఇలాగే బేబీ మనల్ని ఎమోషన్ చేసి వీళ్లు ఎప్పటికప్పుడు గౌతమ్ మీద కేసు పెట్టకుండా చేస్తున్నారు అని వసుంధర అంటుంది. ఎందుకమ్మా మల్లి చేసే ప్రతి పనిలో తప్పు వెతుకుతారు అని మీరా అంటుంది.వాడు జైలుకు వెళ్లాక వాడికి ఉరిశిక్ష పడ్డాక వాడు చచ్చాక నీ కూతురు కూడా ఇలాగే చెయ్యి అప్పుడు తెలుస్తుంది నీకు అని వసుంధర అంటుంది.
వసుంధర అమ్మగారు అమ్మవారి గుడిలో నేను ఇలా చేశాను అంటే అది తప్పక జరుగుతుంది స్వామీజీ చెప్పిన మాట అబద్ధం కాదు అరవింద్ బాబు ఎక్కడో అక్కడ బ్రతికే ఉన్నారు అరవింద్ బాబు నేను తీసుకు వస్తాను ఎక్కడ ఉన్నా సరే నేను వెతికి తీసుకొస్తాను అని మల్లి అంటుంది. తల్లిదయిపోయింది ఇక పిల్లది ఉందా ఎన్నాళ్ళిలా మాబి పెడతారే ముందు నువ్వు బయటికి పో అని వసుంధర అంటుంది. వసుంధర ఎందుకు మల్లి మీరా అన్నది తప్పుగా అర్థం చేసుకుంటావు నిజంగానే అరవింద్ బ్రతికే ఉన్నాడేమో మల్లి మాటలు పాజిటివ్గా ఎందుకు తీసుకోరు నేను కూడా నమ్ముతున్నాను అని శరత్ అంటాడు.
మీ బ్రతుకంతా వాళ్ళకి సపోర్ట్ చేయడమే సరిపోతుంది కదా అని వసుంధర మల్లిని బయటికి వెళ్ళమంటుంది. వాళ్లు ఆవేశంలో ఉన్నారు మల్లి ఏం చెప్పినా అర్థం కాదు నువ్వు వెళ్ళిపో అని శరత్ అంటాడు.అక్క అరవింద్ బాబు బ్రతికే ఉన్నాడు మీరు ఎందుకునమ్మట్లేదు నాకు తెలియదు కానీ అరవింద్ బాబుని నేను వెతికి తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మాలిని అరవింద్ ను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.
బేబీ ఆ మల్లి ఇలా ఎందుకు చేసిందో నాకు తెలియదు కానీ అది గౌతమ్ ని కాపాడుకోవడానికి చేసి ఉంటుంది అని వసుంధర అంటుంది. నాకు అలా ఉండడం నచ్చలేదు మమ్మీ అది కాదు నా జీవితం ఇదే అరవింద్ బ్రతికే ఉంటే ఎప్పుడో నా కళ్ళ ముందుకు వచ్చేవాడు మల్లి నన్ను ఇంకా మభ్య పెట్టాలని చూస్తుంది అని మాలిని బాధపడుతుంది. బేబీ నీ సంతోషం కోసం నేనొక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను నువ్వేమంటావ్ అని వసుంధర అంటుంది. ఏంటి మామ్ అది అని మాలిని అడుగుతుంది. ఏమి లేదు మాలిని నిన్ను ఇలా చూడలేక పోతున్నాను అందుకే నీకు మళ్ళీ పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని వసుంధర అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది