Madhuranagarilo November 23 2023 Episode 217: ఏంటి సార్ అలా చూస్తున్నారు అని రాదా అడుగుతుంది.ఏమీ లేదు రాదా గుడ్ నైట్ చెబుదామని చూస్తున్నాను కానీ మళ్ళీ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తారేమో అని ఆలోచిస్తున్నాను అని శ్యామ్ అంటాడు. ఎవరు రారు లే సార్ గుడ్ నైట్ పడుకోండి అని రాదా అంటుంది. రేపటి నుంచి ఇబ్బంది లేకుండా నా మనసులో మాట నీకు చెప్పి ఈ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను సార్ అని రాధా మనసు అనుకుంటుంది. కట్ చేస్తే, ఏంట్రా ఇంకా స్కూల్ కి రెడీ అవ్వలేదా అని మధుర అంటుంది. నేను ఎప్పుడూ రెడీ అయ్యాను నాని డాడీ రాలేదు అని పండు అంటాడు. ఇంకా వాడు రాకపోవడమేంటి అని వాళ్ళు అటు చూస్తారు.శ్యామ్ ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతున్నాడు అండి అని మధుర అంటుంది. ఏంటి ఫోన్ చేసి మాట్లాడవు సైలెంట్ గా ఉంటే ఏమనుకోవాలి అని శ్యామ్ అంటాడు. నువ్వు ఇంత సీరియస్ మూడ్లో ఉంటే నేను మౌనంగానే ఉంటాను అని రుక్మిణి అంటుంది. సరే ఎందుకు ఫోన్ చేసావ్ చెప్పు అంటూ నవ్వుతూ అంటాడు శ్యామ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సుందరం అని అంటుంది రుక్మిణి.
ఇది చెప్పడానికి ఫోన్ చేసావా అని శ్యామ్ అంటాడు. ఎప్పుడెప్పుడు నన్ను చూద్దామా అని అనిపిస్తుందా ఎమ్మెస్ సుందరం ఈరోజు ఎలాగూ కలుసుకుంటాం కదా అప్పుడు చూద్దువులే అని రుక్మిణి ఫోన్ కట్ చేస్తుంది.ఫోన్ చేసింది ఎవర్రా నీ మొదటి భార్య నా ఏమంటుంది అని మధుర అంటుOది. ఈరోజు మనం కలవాలంటుందమ్మా అని శ్యామ్ అంటాడు. ఇంతలో రాధ వచ్చి ఏమండీ పండుని మామయ్య స్కూల్ కి తీసుకెళ్తాడు మనం గుడికి వెళ్ళాలి ఈరోజు నాకు ముఖ్యమైన రోజు మీరు ఎంత బిజీగా ఉన్నా ఒక గంట నా కోసం కేటాయించండి ఆ గంట నాకు ఎంతో ముఖ్యమైనది అని అంటుంది రాదా. గుడిలో ఉన్నప్పుడు ఆ రాక్షసి ఫోన్ చేస్తే రాదాకి ఎమని సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తాడు శ్యామ్. తనకు అంత ముఖ్యమైనది అయితే తీసుకెళ్ళురా శ్యామ్ నేను పండును తీసుకువెళ్తాను అని ధనంజయ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రుక్మిణి అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. థాంక్స్ అని రుక్మిణి అంటుంది. నువ్వు ఈరోజు చీరలో చాలా అందంగా ఉన్నావే అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. చీర కట్టుకోకపోతే నేను అందంగా ఉండనా అని రుక్మిణి అంటుంది.
నువ్వు ఎలా ఉన్నా అందగత్త వెనే కాని నీ భర్తను కలవబోతున్నావు కదా ఎక్కడ కలుస్తున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. అది సస్పెండే తర్వాత ఆయనకు ఫోన్ చేసి చెప్తానన్నాను కానీ ఇప్పుడు గుడికి వెళుతున్నాను నేను సుందరం కలిసినా గుడికి వెళ్తున్నాను అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే రాదా వాళ్ళు అమ్మవారి గుడికి వస్తారు. పంతులుగారు మా వారి పేరు మీద అర్చన చేయండి అని రాదా అంటుంది. అదేంటి రాధా పండు పేరు మీద కాదా అర్చన చేయించేది నువ్వు అని శ్యామ్ అంటాడు. లేదండి మీ పేరు మీదనే చేయి ఇస్తానని మొక్కుకున్నాను అని రాదా అంటుంది.
పంతులుగారు అర్చన చేస్తూ ఉంటాడు రాధా తన మనసులో అమ్మ నేను ఈరోజు ఆయన మీద ఉన్న ప్రేమను తెలియజేసేలా నన్ను అనుగ్రహించు అని అంటుంది రాదా. రుక్మిణి కూడా అదే గుడికి వస్తుంది. శ్యామ్ రాధా కళ్ళు మూసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. రుక్మిణి కూడా అదే గుళ్లో అమ్మవారి దగ్గర నిలబడి అమ్మ ఇదే రోజు ఎమ్మెస్ సుందరం మెడలో తాళి కట్టాడు పెళ్లి అయినా సంవత్సరానికే మేము ఇద్దరం విడిపోయాము ఇన్నాళ్ళకి మళ్ళీ కలుస్తున్నాము మా జంట ఎప్పటికీ విడిపోకుండా ఉండేలా ఆశీర్వదించమ్మా అని రుక్మిణి అమ్మవారిని వేడుకుంటుంది. అర్చన అయిపోయిన తర్వాత శ్యామ్ వాళ్ళు అలా దూరంగా వెళ్లి కూర్చుంటారు.
రుక్మిణి గుడి చుట్టూ ప్రదక్షణ చేస్తుంది. కట్ చేస్తే ఈ పండు వల్లనే మనం దొంగతనం చేయలేకపోతున్నాము వీడి కాళ్లు విరగొట్టి ఒక మూలన కూర్చోబెట్టాలి అని దాక్షాయణి అంటుంది. అవును ఉండు వాడు లోపలికి వచ్చేటప్పుడు ఈ పైపు అడ్డం పెడదాము అప్పుడు బోక్కర్ల పడి మూతి పండ్లు రాలుతాయి అప్పుడైనా ఒకచోట కూర్చుంటాడు అని చలపతి పైపుని అడ్డం పెడతాడు.పండు లోపలికి వస్తూ ఆ పైపును దాటేసి వెళ్ళిపోతాడు. ఏంటి తాత పైపు అడ్డం పెట్టావు నేను కాబట్టి దునికాను అదే నీకు తగిలింది అనుకో బొక్క బోర్లా పడతావు మొహం పచ్చడి అయిపోతుంది అప్పుడు అమ్మ టిఫిన్ లోకి చట్నీ చెయ్యక్కర్లేదు అని పండు అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!