Mahesh Babu: ఇటీవల `సర్కారు వారి పాట`తో మరో హిట్ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఇప్పటికే ప్రకటించారు. `SSMB 28` వర్కింగ్ టైటిల్తో ఇటీవలె ప్రారంభమైన ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా ఖరారు అయింది.
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. `అతడు`, `ఖలేజా` చిత్రాలు తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కావడంతో.. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తైన వెంటనే మహేశ్ తన 29వ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళితో చేయబోతున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ ప్రాజెక్ట్పై సైతం ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. మహేశ్ కెరీర్లో తెరకెక్కబోయే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. దీనిని శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్పైకె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మహేశ్ 30వ చిత్రంపై ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. మహేశ్ తన 30వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై చేయబోతున్నాడట.
ఇటీవల మైత్రీ వారు మహేశ్ బాబును కలుసుకుని `SSMB 30` తమ బ్యానర్లోనే చేయాలని ఆయన్ను బుక్ చేసేసుకున్నారట. అంతేకాదు, మరో ముందడుగు వేసి రూ. 50 కోట్లు అడ్వాన్స్ ఇస్తామని మహేశ్తో అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారట. దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రానప్పటికీ.. మహేశ్ 30వ ప్రాజెక్ట్ మైత్రీ వారితోనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!