సాధారణంగా హీరోలు ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రకరకాల వ్యాపారాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. అందులో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఒకరు. ఈయన గొప్ప నటుడే కాదు.. సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. ఇప్పటికే సినిమా నిర్మాణ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏషియన్ గ్రూప్తో కలిసి గచ్చిబౌలిలో ఏఎంబి మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు.
అలాగే సినిమాల్లో వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్, వస్త్ర పరిశ్రమ వంటి వాటికి పెట్టుబడిగా పెడుతూ.. తగ్గేదే లా అంటూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మహేశ్ బాబు మరో కొత్త బిజినెస్ లోకి ప్రవేశించబోతున్నారట. ఫుడ్ బిజినెస్లోకి ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్లో సరికొత్త రుచులతో ఓ లగ్జరీ రెస్టారెంట్ స్టార్ట్ చేయబోతున్నాడట. బంజారా హిల్స్లో రెస్టారెంట్ కోసం ఒక ప్లేస్ కూడా ఎంపిక చేసుకున్నారట. అయితే మహేశ్ ఈ ఫుడ్ బిజినెస్ను సోలోగా కాకుండా మినర్వ గ్రూప్తో కలిసి పార్ట్నర్షిప్లో కలిసి చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `సర్కారు వారి పాట` మరో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్న మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్నాడు. ఇది పూర్తైన వెంటనే రాజమౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!