Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం”కి సంబంధించి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ రోజు ఈ సినిమా యూనిట్ మహేష్ ఇంటిలో సక్సెస్ సంబరాలు చేసుకోవడం జరిగింది. అదే సమయంలో యాంకర్ సుమ హీరో మహేష్ బాబు మరియు శ్రీలీలతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అభిమానుల కోసం డాన్స్ బాగా వేయాలని సినిమా స్టార్ట్ అవ్వకముందే రెండు స్పెషల్ సాంగ్స్ కచ్చితంగా ఉండాలని త్రివిక్రమ్ గారితో చర్చించినట్లు తెలిపారు. ఈ క్రమంలో “కుర్చీ మడతపెట్టి” సాంగ్ థియేటర్లో చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించిందని స్పష్టం చేశారు.
సుదర్శన్ థియేటర్లో నాన్నగారితో దూకుడు సినిమా చూడటం జరిగింది. ఆ తర్వాత పిల్లలతో కుటుంబంతో కలిసి గుంటూరు కారం చూశాను. ఆ సమయంలో కొత్త ఫీల్ కలిగింది. నా కూతురు సితార చాలా బాగా ఎంజాయ్ చేసిందని నాకే కొత్తగా అనిపించింది అంటూ మహేష్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇంక సినిమాలో తాగిన బీడీలు గురించి సుమా ప్రశ్నించగా.. అవి ఒరిజినల్ బీడీలు కాదని తెలిపారు. అయితే సినిమా స్టార్ట్ అయిన ప్రారంభంలో ఒరిజినల్ బీడీ తాగేసరికి.. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. మైగ్రేన్ హెడేక్ మళ్లీ వచ్చేసింది. దీంతో నా వల్ల కాదు త్రివిక్రమ్ గారు అని చెప్పేసరికి అప్పుడు ఆయుర్వేదిక్ బీడీ సెట్ కి తీసుకురావడం జరిగింది.
వెంటనే అది ఓకే చేయటంతో.. దాన్ని కంటిన్యూ చేయటం జరిగింది. స్మోకింగ్ నేను ఎంకరేజ్ చేయను.. నేను కూడా స్మోకింగ్ చేయడం లేదు. దీంతో ఆ రకంగా ఆయుర్వేదిక్ బీడీతో…షూట్ చేసినట్లు మహేష్ బాబు తెలిపారు. ఆ బీడీ లవంగాలతో..మింట్ ఫ్లేవర్ తో ఎక్కడ పొగాకు లేదు అని మహేష్ బాబు స్పష్టం చేశారు. మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో స్మోకింగ్ చేసిన సినిమాలు ఉన్నాయి. ఒక్కడు సినిమా నుండి అతిధి వరకు.. స్మోకింగ్ చేస్తూ ఉన్నారు. కానీ తర్వాత కొన్నాళ్లకు.. స్మోకింగ్ ఎలా ఆపేయాలి అన్నదానిపై ఒక పుస్తకం చదివి.. అప్పటినుండి బంద్ చేయడం జరిగింది. కానీ గుంటూరు కారంలో మళ్లీ స్మోకింగ్ చేస్తూ కనబడటం అందరు షాక్ అయ్యారు. అయితే తాజా ఇంటర్వ్యూలో అది ఆయుర్వేదిక్ బీడీ అని మహేష్ చెప్పటం జరిగింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!