YS Sharmila: అందరూ ఊహించినట్లుగానే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు నిన్న రాజీనామా చేయడంతో షర్మిల నియామకానికి లైన్ క్లీయర్ అయ్యింది.
రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల వ్యవధిలో షర్మిల నియామకానికి సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే క్రమంలో షర్మిల కోసం తన పదవిని త్యాగం చేసిన గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడుగా నియమితులైయ్యారు.
వైఎస్ షర్మిల ఇటీవల తన వైఎస్ఆర్ టీపీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది.
రేపు (17వ తేదీ) మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలో ఏపీ లో లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ రోజే షర్మిలకు పార్టీ హైకమాండ్ పీసీసీ బాధ్యతలు అప్పగించింది. రాబోయే ఎన్నికల్లో కనీసం 15 నుండి 20 అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. 15 – 20 స్థానాల్లో విజయం సాధిస్తే కింగ్ మేకర్ పాత్ర పోషించవచ్చని అశిస్తున్న పార్టీ అధిష్టానం ఆ దిశగా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తొంది.
Supreme Court: చంద్రబాబు కేసులో బిగ్ ట్విస్ట్ .. సీజే ధర్మాసనం ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్