Malli Nindu Jabili February 13 2024 Episode 571: ఎన్నిసార్లు నేను అరవింద్ ను చంపలేదని చెప్పాడమ్మా అంటే ఇన్ని రోజులు అబద్దం చెప్పాడా అదంతా నిజమే అనుకున్నాను అని మాలిని ఏడుస్తుంది. నేను చెపితే నువ్వు నమ్మలేదు మాలిని కానీ గౌతమ్ హత్య చేశాడు ఈ ఆధారమే వాడు నేరం చేశాడా లేదా అని ప్రూఫ్ చేస్తుంది వెళ్లి వాడి మీద కేసు పెడదాం అని వసుంధర అంటుంది. నిజంగానే నేను ఎంత నమ్మానమ్మా తను ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు అని మాలిని బాధపడుతుంది. ఆ కౌసల్య మల్లి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని నాకు డౌట్ గా ఉంది మాలిని ఆ కౌశల్య తక్కువది ఏం కాదు మల్లి కూడా తక్కువదయం కాదు అక్క అక్క అంటూ నీ వెనకాల తిరుగుతుంది కానీ అరవింద్ హత్యలో తను కూడా భాగమే ఉంటుంది అని వసుంధర అంటుంది. గౌతమ్ మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే మామ్ అని మాలిని అంటుంది.
ఇక వాడు తప్పించుకోలేడు మాలిని నువ్వు ఏడవకు ధైర్యంగా ఉండు వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు అనివసుంధర అంటుంది.కట్ చేస్తే గౌతమ్ మాలిని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మల్లి వచ్చి ఏం ఆలోచిస్తున్నారండి అని అడుగుతుంది. అరవింద్ నీ చంపానని మాలిని అన్నది కదా కేసు పెడతానని కూడా బెదిరించింది తన నిజంగా కేసు పెడితే అన్యాయంగా నేను ఇరుక్కుపోతాను అని గౌతమ్ అంటాడు. ఇలా అంటున్నానని మీరేమీ అనుకోకండి నిజంగానే అరవింద్ బాబుని మీరు చంపారా నిజం చెప్పండి అని మల్లి అడుగుతుంది.నీ దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు మల్లి నువ్వు నన్ను నమ్మావు అనుకున్నాను నేను ఇంత మారినా కూడా నువ్వు నమ్మలేదా అని గౌతమ్ బాధపడతాడు. నీ మీద నమ్మకం లేకపోవడమేంటండి కానీ మాలిని అక్క అన్న మాటలు వింటుంటే ఒకసారి అడిగితే బాగుండు అనిపించింది
అందుకే అడిగాను మీరు ధైర్యంగా ఉండండి అక్క కేసు పెట్టేది లే అని మల్లి అంటుంది. తను కేసు పెడతాను అని ఖచ్చితంగా చెప్పింది అంటే ఇంకా వసుంధర ఊరుకుంటుందా మళ్లీ ఎలాగైనా సరే మాలిని నీ ఒప్పించి నా మీద కేసు పెట్టిస్తుంది అని గౌతమ్ భయపడతాడు. అలా ఏమీ జరగదులే మీరు వచ్చి పడుకోండి దాని గురించి ఇంకేమి ఆలోచించకండి అని మల్లి గౌతమ్ ని తీసుకొచ్చి పడుకోబెడుతుంది. కట్ చేస్తే, వసుంధర మాలిని ఎక్కడికో వెళ్తున్నారు.ఎక్కడికి వెళ్తున్నారు అని శరత్ అడుగుతాడు. ముఖ్యమైన పని ఉంది డాడీ వెళ్తున్నాం అని మాలిని అంటుంది. నాకు చెప్పకూడనిదా అని శరత్ అంటాడు. తర్వాత నీకే తెలుస్తుంది లే డాడీ అని మాలిని వసుంధర వెళ్ళిపోతారు. కట్ చేస్తే, గౌతమ్ పనికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో కౌసల్య వచ్చి గౌతమ్ ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. ఆఫీసుకు వెళ్తున్నాను అమ్మ అని గౌతమ్ అంటాడు. నిజంగా నువ్వు అరవింద్ ని హత్య చేయలేదా నీ మాటలు వింటుంటే మాలిని మాటలు వింటుంటే నాకెందుకో అనుమానంగా ఉంది రా ఆ మాలినీ కేస్ పెడుతుందేమో నువ్వు ఈరోజు ఆఫీస్ కి వెళ్లకుండా ఉంటే మంచిది అని కౌసల్య అంటుంది. నా భార్యకున్న నమ్మకం నీ కొడుకు మీద నీకు లేదా అమ్మ నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అని గౌతమ్ అంటాడు.
మాలిని కేసు పెట్టి పోలీసులతో ఇంటికి వస్తానన్నది రా ఆ వసుంధర తక్కువ దేంకాదు నిన్ను ఎలాగైనా ఇరికించాలని పగతో రగిలిపోతుంది మాలిని చూపించిన ప్రూఫ్స్ పట్టుకొని పోలీసులు ఆశ్రయిస్తే నిన్ను వదిలిపెట్టరు ఎలాగైనా సరే నిన్ను పోలీస్ స్టేషన్లో పెడతారు నువ్వు ఈరోజు ఆఫీస్ కి వెళ్లొద్దు నాన్న అని కౌసల్య అంటుంది. నా మీద కేసు పెట్టాలనుకుంటే ఇంట్లో ఉంటే మాత్రం ఆగుతారా అమ్మ ఏది జరగలో అదే జరుగుతుంది అందుకని పని మానేసి ఇంట్లో కూర్చోమంటావా వెళ్తాను అని గౌతమ్ అంటాడు. నిజంగా అరవింద్ ని హత్య చేయలేదని నా మీద ఒట్టేసి చెప్పరా అని కౌసల్య తన చేయి తీసుకొని తల మీద పెట్టుకుంటుంది. నీ కొడుకుని నువ్వే నమ్మకపోతే వసుంధర అత్త ఎలా నమ్ముతుందమ్మ ఆయన ఆరోజు నేను ఫోన్ చేయకుండా ఉండాల్సింది నేను హత్య చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా నమ్మట్లేదు కదా అని గౌతమ్ బాధపడుతూ బయటికి వెళ్లిపోతాడు. ఇంతలో మల్లి వచ్చి అత్తయ్య ఆయనెక్కడ టిఫిన్ బాక్స్ మర్చిపోయాడు అని అడుగుతుంది.
ఆఫీసుకు వెళ్లే వాడికి పొద్దునే లేచి బాక్స్ పెట్టాలని తెలియదా నువ్వు కూడా పని చేసుకుంటానన్నావు కదా చూసుకోలేదు అని కౌసల్య మల్లి ని కోప్పడుతుంది. ఎందుకు అత్తయ్య అంత కోపంగా ఉన్నారు అని మల్లి అంటుంది. గౌతమ్ మీద వసుంధర వాళ్ళు కేసు పెడతారేమో అని భయమేస్తుంది నువ్వు వెళ్లి మాలినీతో మాట్లాడు అని కౌసల్య అంటుంది. నేను ఎవరిని అడగను అత్తయ్య నా భర్త హత్య చేయలేదని నాకు నమ్మకం ఉంది వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వు నా భర్తను కాపాడుకుంటాను నా భర్త హత్య చేయలేదు అని మల్లి అంటుంది. కట్ చేస్తే, గౌతమ్ ఆఫీస్ కి వెళ్తూ ఉండగా వసుంధర మాలిని కారు వేసుకుని వెళ్లడం గమనిస్తాడు గౌతమ్.మాలిని నా మీద కేసు పెడతానన్నది నిజంగా అక్కడికే వెళ్తుందా పక్కనే పోలీస్ స్టేషన్ కదా అక్కడికి వెళ్తున్నారా అని గౌతమ్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు. మాలిని వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.
ఇదేంటి అత్త వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చారు నా మీదనే కేసు పెడతానికి వచ్చారా అని గౌతమ్ చెట్టు చాటు నుండి చూస్తూ ఉంటాడు. మాలిని వసుంధర పోలీస్ స్టేషన్ లోకి వెళుతూ ఉండగా శరత్ వచ్చి వసుంధర ఆగు అని పిలుస్తాడు. మీరు మమ్మల్ని ఫాలో అయ్యే ఎందుకు వచ్చారు డాడీ అని మాలిని అడుగుతుంది. మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి కదా మీ డాడీ అని వసుంధర అంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని శరత్ అంటాడు. కేసు పెట్టడానికి డాడీ గౌతమ్ మీద అని మాలిని చెబుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!