Malli Nindu Jabili October 21 ఎపిసోడ్ 473: మల్లికి ఫోన్ చేసి ఇందాక గౌతమ్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మేనేజర్ వచ్చి పాస్ ఫొటోస్ కావాలి అన్నప్పుడు పర్సులో నుంచి నీ ఫోటో కింద పడింది అది గౌతం చూసి నాకు వార్నింగ్ ఇచ్చి పంపించాడు తొందరపడి నువ్వు ఏమీ నోరు జారకు అడిగితేనే చెప్పు అని అరవింద్ ఉంటాడు. పొద్దున నన్ను కూడా గుడిలో నేనంటే ఇష్టమా అరవింద్ అంటే ఇష్టమా అని అడిగి గుళ్లో రభస చేసాడు అని గుడిలో జరిగిందంతా మల్లి అరవింద్ కి చెబుతుంది నా చుట్టూ ఎన్ని జరుగుతున్నాయి అంటే నాకు ఒకటి అర్థం అవుతుంది బాబు గారు మిరు అయిన ఉండాలి నేనైనా ఉండాలి అని మల్లి అంటుంది..
వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది చూసిన గౌతమ్ మల్లిని రమ్మని పిలుస్తాడు. రమ్మన్నారంట ఏంటి అని మల్లి అంటుంది. ఏమీ లేదు మల్లి, అరవింద్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లాలని అమ్మ చెప్పింది సరే అని చెప్పడానికి నా ఫోన్ స్విచాఫ్ అయింది ఒకసారి అమ్మకి ఫోన్ చేసి చెప్తాను అని గౌతమ్ అంటాడు. అమ్మో నెంబర్ డిలీట్ చేయడమే మంచిది అయింది అని మల్లి తన మనసులో అనుకుంటుది ఫోన్ తీసుకున్న గౌతమ్ ఏంటి మల్లి నెంబర్ డిలీట్ చేసింది అని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నేను మల్లి తొందరగా వచ్చేస్తున్నాం అనిరుద్ వాళ్ళ ఇంటికి భోజనానికి అని గౌతమ్ వాళ్ళ అమ్మతో అంటాడు. సరే గౌతమ్ అని వాళ్ళ అమ్మ అంటుంది. మల్లి గౌతమ్ దగ్గర నుంచి బయటికి వచ్చాక అరవింద్ ఏమైంది అని అంటాడు.
బతుకు దిన దిన గండం కాదు క్షణక్షణానికో గండం అవుతుంది అని మల్లి అంటుంది. కట్ చేస్తే అరవింద్ ఇంటికి రాగానే థాంక్యూ అరవింద్ చెప్పగానే వచ్చినందుకు అమ్మ ఇక మేము బయలుదేరుతాం అని మాలిని అంటుంది. కూతురి మొహంలో ఎంత సంతోషం కనబడుతుందో ఈ ట్రిప్ తర్వాత కూడా అంతే సంతోషంగా ఉండాలి అని వసుంధర అంటుంది. ఏదో ఆలోచిస్తున్నారు ఏంటి అరవింద్ అని శరత్ అంటాడు. ఏమీ లేదు అంకుల్ అని అరవింద్ అంటాడు. ఏమీ లేదని నువ్వు అంటున్నా నీ మొహం లో కనపడుతుంది అని వసుంధర అంటుంది. అరవింద్ ఎలా వెళ్దాం క్యాబ్లో వెళ్దామా అని మాలిని అంటుంది. క్యాబ్లో ఎందుకు మాలిని మీ డాడీ డ్రాప్ చేస్తారులే అని వసుంధర అంటుంది. ఇదే కరెక్ట్ టైం ఆ మీరా సంగతి చెప్పడానికి అని వసుంధర సైలెంట్గా ఉంటుంది. వాళ్లు వెళ్తుంటే మీరా బయటికి వచ్చి వాళ్ళని సాగనంపుతుంది.
ఇంకా నువ్వు ఏం చూస్తున్నావ్ ఇక బయలుదేరు మా ఇంట్లో నుంచి అని వసుంధర అంటుంది. అమ్మగారు ఏమంటున్నారు అని మీరా కంగారుగా అంటుంది. ఇన్నాళ్లు నా ఇంట్లో ఉండి నన్ను అవమానించింది చాలు నా కూతురు జీవితంతో ఇక ఆడుకోవద్దు నా జోలికి ఇంకా రావద్దు మీ అమ్మ నేలకొండపల్లికి వెళ్ళింది కదా నువ్వు కూడా అక్కడికే బయలుదేరు అని వసుంధర అంటుంది. శరత్ బాబు గారు వచ్చాక ఒక మాట చెప్పి వెళ్తాను అని మీరా అంటుంది. ఏం మాట్లాడుతావ్ ఆయన రాగానే ముసలి కన్నీళ్లు పెట్టుకుంటావ్ ఆయనేమో నా మీద కోపంతో మండి పడతారు నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు నీ వల్ల నేను ఎన్నో కోల్పోయాను ఇన్ని రోజులు నిన్ను భరించింది మల్లి జీవితాన్ని చక్కదిద్దుతావని ఊరుకున్నాను ఇక మల్లి పెళ్లి అయింది అన్ని పనులు తీరిపోయాయి కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తుంది. ఎవరూ లేని సమయం చూసి ఇలా చేయడం ఏమీ బాగోలేదు అమ్మగారు అని మీరా అంటుంది. నీవల్లే నేను హత్య చేస్తానేమో అనిపిస్తుంది నువ్వు నీ కూతురు నన్ను పెట్టిన టార్చర్ ఇంకా చాలు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఇంక ఎన్నాళ్ళు నా కొంపలో పడి తింటారు అని వసుంధర మీరా బ్యాగులు తెచ్చి బయట విసిరేస్తుంది.
ఏమీ చేయలేని పరిస్థితిలో మీరా బ్యాగు తీసుకొని బయటికి వెళ్తుంది. అమ్మ ఫోన్ ఎత్తట్లేదు ఏంటి మాట్లాడదామంటే అని మల్లి అంటుంది. ఫోన్ ఎందుకు మల్లి డైరెక్టుగా ఇంటికి వెళ్లి కలుద్దాం అని గౌతమ్ అంటాడు. మాలిని ఎయిర్ పోర్ట్ కి రీచ్ అయ్యారా అని వసుంధర అంటుంది. ఇంకా లేదు మామ్ అని మాలిని అంటుంది. హ్యాపీ జర్నీ ఈ ట్రిప్పు తోటి అయినా నీ మొహం లో సంతోషం కలకాలం ఉండాలి ఫ్లైట్ ఎక్కాక మళ్ళీ ఒకసారి కాల్ చేయి అని వసుంధర అంటుంది. అలాగే మామ్ అని మాలిని ఫోన్ కట్ చేస్తుంది. గౌతమ్ మల్లి డైరెక్ట్ గా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడతారు.
ఈసారి మీరా వస్తే గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని వసుంధర అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది ఏంటి ఆ మీరా అయి ఉంటుంది అని డోరు తీసి చూసేసరికి గౌతమ్ మల్లి కనపడతారు ఏంటి ఇలా వచ్చారు దారితప్పి వచ్చారా ఏంటి అని వసుంధర అంటుంది. మల్లి కి వాళ్ళ అమ్మని చూడ బుద్ధి అయింది అందుకే వచ్చింది అని గౌతమ్ అంటాడు. మల్లి లోపలికి వెళ్లి అమ్మ అమ్మ అని గదులన్నీ వెతుకుతుంది వాళ్ళమ్మ ఎక్కడ కనిపించదు. ఇంట్లో లేదు అని వసుంధర అంటుంది. ఎక్కడికి వెళ్ళింది అని గౌతమ్ అంటాడు.అమ్మ ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని మల్లి ఆలోచిస్తూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!