Naga Panchami: నాగదేవత శాపానికి గురి అవ్వడం కన్నా మేము వెళ్లి ఆ యాగాన్ని ఆపడానికి ప్రయత్నించి ఆత్మహత్య అవుతాము అని నాగిని లు అంటారు. తెలిసి అగ్నికి ఆహుతి అవడం అంత మంచిది కాదు అందుకే మన యువరాణి ఇలా యాగాన్ని మొదలు పెట్టింది కొద్దిసేపటి తర్వాత అయినా అవకాశం దొరకకపోదు అప్పుడు వెళ్లి దాడి చేద్దాం యాగం పూర్తిగా చివరి వరకు చేయనిదే ఫలించదు మధ్యలో వదిలేసి వెళ్లడం అంత మంచిది కాదు అని యువరాజు అంటాడు. కట్ చేస్తే,పంచమి వస్తున్నాను నిన్ను బంధించడం మోక్షని నా సొంతం చేసుకోవడం ఆ నాగమణి సొంతం చేసుకోవడం జరుగుతుంది ఇక నాగమణి నా సొంతం అయిపోయినట్టే ఇక నాకు తిరుగు ఉండదు అని మోహిని అనుకుంటుంది.నా పంచమిని కాపాడడానికి హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్ మోహిని అని మోక్ష అంటాడు.అలా వాళ్ళు అడవిలో పంచమి వెతుక్కుంటూ ఉంటారు. ఒకచోట మంటలో అగ్నికి ఆహుతి అయిపోతున్నా పంచమి పూర్తిగా నాగిని అయిపోయా ఐదు పడగలు ఎత్తి బుసలు కొడుతున్న పంచమి చూసి భయపడతారు.
భయపడకు మోక్ష పంచమి ఐదు పడగల నాగినిగా మారిపోయింది అని మోహిని అంటుంది. నేను నమ్మను అని మోక్ష అంటాడు. ఇష్ట రూప నాగిని లు ఏ రూపానైన దాల్చగలవు మోక్ష నువ్వు నా వనికే ఉండు నా మంత్ర శక్తితో తనని బంధిస్తాను అని మోహిని అంటుంది. మోహినిని చూసి బుసలు కొడుతుంది పంచమి. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో లేదంటే బంధించేస్తాను అని మోహిని అంటుంది. మోహిని ఆ పాము నిజంగా నా భార్య అయితే తనకు దెబ్బలు తగ్గుతాయి ఏమి చేయకు అని మోక్ష అంటాడు. తనకి ఇప్పుడు మనం ఎవరమో తెలియదు నీ మీద పగ పట్టింది కాబట్టి నిన్ను కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది అని మోహిని అంటుంది. పాము వాళ్ళిద్దరి వెంట పడుతుంది. ఇక మనం తప్పించుకోలేము మోక్ష నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని మోహిని అంటుంది. నువ్వు కూడా నాతో వచ్చేసేయ్ అపాము నిన్ను కూడా వదలదు అని మోక్ష అంటాడు. ఇకనుంచి వెళ్ళు అని తనని పంపించేస్తుంది మోహిని. మోక్ష వెళ్లిపోయాడు తనని చెట్ల మధ్యలో బంధించాలి అని మోహిని అనుకుంటుంది. ఇంతలో ఆ పాము తనని తోకతో బంధించేస్తుంది. తనని అటు ఇటు చెట్టుకు కొడుతుంది పంచమి దెబ్బలు తగిలి స్పృహ కోల్పోతుంది మోహిని. కట్ చేస్తే,
మోక్ష పాము నుండి తప్పించుకోవడానికి చెట్లు పుట్టలు దాటుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. అపాము వేగంతో తన దగ్గరికి రానే వస్తుంది. నువ్వు పాముగా మారితే నేనెవరో నీకు తెలియదు పంచమి ఇక నచ్చావు ఎవరు ఆపలేరు అని మోక్ష అంటాడు. ఆ పాము బుసలు కొడుతూ మోక్ష మీదికి వెళ్తుంది. ఈ పూర్ణాహుతితో యాగం పూర్తవుతుంది ఈ ద్రవ్యాలని అగ్నిదేవుడికి సమర్పించండి అని వశిష్ట మహర్షి అంటాడు. అలాగే అని రఘు వైదేహి ఆద్రవ్యాలను అగ్నిదేవుడికి సమర్పిస్తారు ఇస్తారు. అమ్మ మహామృత్యుంజయ యాగా0 సంపూర్ణంగా ముగిసింది మీరు మనసులో ఏం కోరికొని కోరుకొని ఈ యాగాన్ని తలపెట్టారు అది సిద్ధిస్తుంది అని మహర్షి చెప్తాడు. మహాదేవుడికి హారతిస్తూ హర హర మహాదేవ శంభో శంకర అంటారు అందరూ. కట్ చేస్తే,ఆ పాము దాటికి తట్టుకోలేక మోక్ష స్పృహ కోల్పోతాడు. ఆ యాగం ఫలించి పంచమి మనిషిగా మారిపోయి మోక్ష దగ్గరే పంచమి కూడా పడిపోయి ఉంటుంది. కట్ చేస్తే,
సప్త ఋషులు వచ్చి స్వామి అని పిలుస్తారు. అప్పజెప్పిన పనిని సంపూర్ణంగా విజయవంతం చేశారు అని సుబ్బు అంటాడు. కర్త క్రియ అంతా మీరే మేము చేసింది స్వల్పమే కదా స్వామి అని మహర్షి అంటాడు. మీరు పట్టిచే మంత్ర శక్తితో వృత్త్యుని కూడా ముక్కుతిప్పలు పెడుతుంది అని సుబ్బు అంటాడు. నిన్ను నమ్ముకున్న భక్తులకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటావు కదా మణికంఠ అని మహర్షి అంటాడు. భగవంతుడు ఉన్నాడని గాఢంగా నమ్మిన భక్తుల కోసం చేయక తప్పదు అని సుబ్బు అంటాడు. ఒక భక్తురాలి కోసం ఇంతలా తాపత్ర పడడం మీ గొప్పతనం మణికంఠ అని మహర్షి అంటాడు.
తనకి రెండు లోకాలు తన రెండు లోకాలకు సంబంధించిన కష్టాలు ఒకేసారి మీద పడేసరికి తనకు దైవంతో మరింత ఎక్కువ అవసరం పడింది ఈ విశ్వంలో ఎవరికీ రాకూడని కష్టం నా భక్తురాలికి వచ్చింది ఒకే సమయంలో తన భర్తను శిక్షించాలి తన భర్తని కాపాడుకోవాలి తన భర్తను శిక్షించకపోతే ఒక లోకం తనను వెలివేస్తుంది తన భర్తను బ్రతికించుకోకపోతే నా భక్తురాలు ఈ లోకాన్ని వదిలేస్తుంది ఏ విధంగానూ తన భర్త ప్రాణాలతో ఉండే వీలు లేదు అని సుబ్బు అంటాడు. ఇంత జటిలమైన సమస్య నుంచి నీ భక్తురాలు బయటపడగలద స్వామి అని మహర్షి అంటాడు.
అధి కాలమే నిర్ణయించాలి మహర్షి నేను నా భక్తులకు చేయూతను అందించగలను కానీ ఏ జీవి అయినా కర్మఫలం అనుభవించాల్సిందే కష్టకాలం అనుభవించాల్సిందే కదా నా భక్తురాలు ఈ విషమ పరీక్షను తట్టుకొని ఎలా నిలబడుతుందో చూడాలి అని సుబ్బు అంటాడు. మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అని మహర్షులు అంటారు. సదాస్తు అని మణికంఠుడు దీవించగానే మహర్షులు వెళ్ళిపోతారు. స్వామి కూడా వెళ్ళిపోతాడు..
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!