కింగ్ నాగార్జున తనయుడిగా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్లోనే వరసగా మూడు ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్.. తన ఐదో చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో స్టార్ట్ చేశాడు. అదే `ఏజెంట్`.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్గా నటించింది. అలాగే మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రను పోషించాడు. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్గా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేశారు.
కానీ, ఆ తేదీకి సినిమాను ప్రేక్షకల ముందుకు తీసుకురాలేపోయారు. అయితే ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తారని ప్రచారం జరిగినా.. ఆ సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఇక డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే.. `ఏజెంట్` ఆలస్యం వెనక నాగార్జున హస్తం ఉందంటూ తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
అసలేమైందంటే.. `ఏజెంట్` షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. కానీ, కొన్ని సన్నివేశాలు మరింత బెటర్ గా రావడం కోసం డైరెక్టర్ సురేందర్ రెడ్డి రీ షూట్ అడిగాడట. కానీ, నాగార్జున అందుకు ఒప్పుకోలేదట. రీ షూట్ చేయాలనుకున్న సన్నివేశాల పట్ల నాగార్జునతో పాటు అఖిల్, నిర్మాత అనిల్ సుంకర పూర్తి సంతృప్తిగా ఉన్నారట. అయితే ఈ విషయంపైనే డిస్కషన్లు జరుగుతున్నాయని, అందుకే సినిమా విడుదలను ఆపారని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!