Guntur Kaaram: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో మహేష్ బాబు ఒకరు. మహేష్ సినిమాలకు మహిళల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మహేష్ కొత్త సినిమా “గుంటూరు కారం”కి మహిళా అభిమానులకు నమ్రత గుడ్ న్యూస్ తెలియజేశారు. విషయంలోకి వెళ్తే.. విజయవాడ గాంధీనగర్ లో రాజ్ థియేటర్ లో మొదటిరోజు “గుంటూరు కారం” ఫస్ట్ షో ప్రత్యేకంగా మహేష్ మహిళా అభిమానులకు వేస్తున్నట్లు తెలియజేశారు. ఏడాదిన్నర తర్వాత మహేష్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో బుకింగ్స్ ఓపెన్ అవటం ఫుల్ అయిపోవడం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది.
“కుర్చీ మడతపెట్టి” సాంగ్ కి విపరీతమైన ఆదరణ దక్కింది. ఈ పాటలో మహేష్ మాస్ స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏ సినిమాకి లేని రీతిలో “గుంటూరు కారం”లో మహేష్ డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించడం జరిగింది. ప్రకాష్ రాజ్, రఘుబాబు, వెన్నెల కిషోర్, జయరాం, రమ్యకృష్ణ, రావు రమేష్ లాంటి భారీ తారాగణంతో ఈ సినిమా నిండుకొని ఉంది. మహేష్ బాబు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తుంది.
దాదాపు పుష్కరకాలం తర్వాత అనగా 12 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ కలయికలో వస్తున్న ఈ మూడో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండిటిలో మహేష్ బాబు ని చాలా కొత్తగా చూపించడం జరిగింది. ఇప్పుడు గుంటూరు కారంలో కూడా కొత్త మహేష్ బాబుని చూస్తారంటూ స్వయంగా మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియజేశారు. దీంతో సినిమాలో మహేష్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!