YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లో మూడో జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్పులు, చేర్పులు చేపట్టినట్లుగా తెలుస్తొంది. అయితే మూడో జాబితాలో మొత్తం 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ నిరాకరించినట్లు సమాచారం.
వాస్తవానికి నిన్న రాత్రే మూడో లిస్ట్ ను విడుదల చేయాల్సి ఉన్నా రెండు మూడు నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ రాకపోవడం, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు మున్సిపల్ కార్మిక సంఘాలతో సమ్మె విరమణపై చర్చలు జరుపుతున్న నేపథ్యంలో మూడో లిస్ట్ ప్రకటన వాయిదా వేశారని తెలుస్తొంది. తొలి జాబితాలో 11, రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయగా, తాజాగా 30 నియోజకవర్గాలకు ఇవేళ ఇన్ చార్జిలను ప్రకటించనున్నది వైసీపీ.
నియోజకవర్గాల వారీగా రాజమండ్రి (ఎంపీ) – సిటీ డైరెక్టర్ వీవీ వినాయక్, కర్నూల్ (ఎంపీ) – గుమ్మనూరు జయరాం, విశాఖ (ఎంపీ) బొత్స జాన్సీరాణి, విజయనగరం (ఎంపీ) – మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి (ఎంపీ) – అడారీ రమాదేవి, నెల్లూరు (ఎంపీ) వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పేర్లు దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తొంది. అలానే విజయవాడ లోక్ సభ స్థానానికి టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నానికి ఖరారు చేసినప్పటికీ ఇంకా అధికారికంగా పార్టీలో చేరనందున ఈ జాబితాలో ప్రకటన చేయడం లేదని సమాచారం.
అసెంబ్లీ ఇన్ చార్జిల విషయానికి వస్తే చింతలపూడి నియోజకవర్గ ఇన్ చార్జిగా విజయరాజు, మడకశిరకి పోలీస్ అధికారి శుభకుమార్, గూడురు నియోజకవర్గానికి మేరుగ మురళి, దర్శిక బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రాయదుర్గానికి మెట్టు గోవిందరెడ్డి, చిత్తూరుకు విజయానంద రెడ్డి, ఆలూరుకు విరూపాక్ష, నందికొట్కూర్ కు గంగాధర, మార్కాపురంకు జంకె వెంకట్ రెడ్డి, పెందుర్తి ఇన్ చార్జిగా ఆదుర్తి రాజు, గంగాధర నెల్లూరుకు కృపాలక్ష్మి లను ఇన్ చార్జిలుగా నియమించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే అధికారికంగా ఇవేళ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవేళ మూడో జాబితాను ప్రకటించనున్నారని సమాచారం. మూడో జాబితాలో ఒకటి రెండు చోట్ల మార్పులు చేర్పులు ఉండవచ్చని అనుకుంటున్నారు.
Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు