విభిన్న కథలకు కేరాఫ్గా మారిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తే.. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనమ్, శ్రీనివాస రెడ్డి తదితరులు కీలక పాత్రలను పోషించారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. 2014లో వచ్చిన బ్లాక్ బస్టర్ `కార్తికేయ`కు సీక్వెల్ ఇది. ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సౌత్ లోనే కాదు నార్త్ లోనూ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతూ.. మూడు రోజుల్లోనే క్లీన్ మిట్ గా నిలిచింది. ప్రస్తుతం భారీ లాభాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించాడు. సినిమా మంచి విజయం సాధించడంతో.. చిత్ర టీమ్ మొత్తానికి ఆయన కంగ్రాట్స్ చెప్పారు.
`కార్తికేయ2` లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన మొత్తం యూనిట్ కి అభినందనలు చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టారు. ఇది చూసిన నిఖిల్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అంతేకాదు, ప్రభాస్ పెట్టిన పోస్ట్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ థ్యాంక్యూ చెప్పాడు. మొత్తానికి ప్రభాస్ స్వయంగా స్పందించడంతో.. `కార్తికేయ 2`కు మరింత క్రేజ్ ఏర్పడింది.
Prabhas Bhai 🙏🏽🙏🏽🙏🏽 thanks for the Wishes🙏🏽🙏🏽🙏🏽🔥 #Karthikeya2 team is overwhelmed with your message to us 🔥🔥🔥#Karthikeya2Hindi pic.twitter.com/2bDBcOLMnC
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 17, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!