Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: అరుంధతి భాగమతి ఒంట్లో ప్రవేశిస్తుంది. ఇంతలో గుప్తా వచ్చి బాలిక నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పిదము నేను చెప్పేది వినుము బయటికి రమ్మను అని గుప్తా అంటాడు. గుప్తా గారు మిమ్మల్ని ఎవరు ఇక్కడికి పంపించారు అ మనోహరి మమ్మల్ని పెళ్లికి తీసుకురమ్మని పంపించిందా అని మంగళ అడుగుతుంది. గుప్తా గారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు బాలిక ఎవరు అని రామ్మూర్తి అంటాడు. భాగమతి కోపంగా డోర్ వేసుకుంటుంది. బాలిక వినిపించుచున్నదా నీతోనే మాట్లాడుతున్నాను అని గుప్తా అంటాడు. నా కూతురుతో ఏం మాట్లాడుతారు గుప్తా గారు అని రామ్మూర్తి అంటాడు. నీ పెద్ద కూతురు నీ చిన్న కూతురుకి సహాయం చేయడానికి వచ్చింది అని ఎలా చెప్పను అని గుప్తా మనసులో అనుకుంటాడు.
ఇంతలో భాగమతి చీర కట్టుకొని బయటికి వస్తుంది. భాగీ పెళ్లికి వెళ్తున్నావా పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావా ఇలా రెడీ అయ్యావు అని మంగళ అడుగుతుంది. నా కూతురు పెళ్లి ఎందుకు చేసుకుంటుందే అని రామ్మూర్తి అంటాడు. పెళ్లి ఆపడానికి వెళ్తున్నాను అంటూ భాగమతి కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మనోహరి నీ వెతుకుతున్న అతను అమరేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని మనోహరి ఎక్కడ అని అడుగుతాడు. ఆవిడకి అమరేంద్ర కి పెళ్లి ఈరోజు అందరూ గుడికి వెళ్లారు అని సెక్యూరిటీ గార్డ్ చెబుతాడు. ఏంటి పెళ్లయిన మనోహరి కి మళ్ళీ పెళ్ళా అని అతను అంటాడు. ఏంటి మనోహరి కి పెళ్లి అయిందా అని సెక్యూరిటీ గార్డ్ ఆశ్చర్యపోతాడు. మనోహరి కి పెళ్లి కాలేదని ఎవరు చెప్పారు నీకు తెలుసా అని సెక్యూరిటీ గార్డెని బెదిరించి అడ్రస్ తెలుసుకుని వెళ్లిపోతాడు అతను. కట్ చేస్తే, అమరేంద్ర ని చూసి బాధపడుతూ ఉంటాడు శివరామ్. ఏం ఆలోచిస్తున్నారండి అని నిర్మల అడుగుతుంది.
దేశాన్ని కాపాడడం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే నా కొడుకు మొదటిసారి కన్నీళ్లు పెట్టుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను ఏదో తప్పు జరుగుతోంది నిర్మల అని శివరామ్ అంటాడు. అమరేంద్ర కి పెళ్లి అయితే చాలాని నిన్నటి వరకు అనుకున్నానండి కానీ నిన్న సాయంత్రం నుంచి నాకు కూడా ఈ పెళ్లి మనోహరి తో జరగడం మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు ఎందుకు భయంగా ఉందండి అని నిర్మల అంటుంది. ఆ భగవంతుడు వాడి జీవితానికి ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి దూరం చేశాడు అని శివరామ్ అంటాడు. ఈ పెళ్లి తోటి అయినా వాడి జీవితంలో ఆనందం వస్తుంది ఆ మనోహరి మన వాడిని ప్రేమగా చూసుకుని ఇద్దరు కలిసిమెలిసి ఉంటే అంతే చాలు అని నిర్మల అంటుంది.
శివరామ్ రాథోడ్ కి ఫోన్ చేసి ఇంకా పిల్లల్ని తీసుకొని పెళ్లికి రాలేదేంటి అని అడుగుతాడు. వాళ్లకు పెళ్లి ఇష్టం లేదంట సార్ పిల్లలు పెళ్లికి రమ్మంటున్నారు అని రాథోడ్ చెబుతాడు. ఏదో ఒకటి చెప్పి పిల్లల్ని తీసుకురా అని శివరమ్ అంటూ ఉండగా ఇంతలో భాగమతి అక్కడికి వస్తుంది. మిస్సమ్మ వస్తుంది నేను తర్వాత ఫోన్ చేస్తాను సార్ అంటూ రాథోడ్ ఫోన్ కట్ చేస్తాడు.
బాలిక జరుగుతున్నది వీక్షించడం తప్ప ఏమీ చేయరాదని నీకు ఆరోజే చెప్పాన నువ్వు ఎక్కువసేపు ఈ బాలిక ఒంట్లో ఉండటం మంచిది కాదు అని గుప్త అంటాడు. గుప్తా గారు మీరు చెప్పినట్టే పెళ్లి పదకొండు గంటలకు అయిపోగానే భాగమతి ఒంట్లో నుంచి వచ్చేస్తాను అప్పటిదాకా నన్ను ఏమీ అడగకండి నా కుటుంబాన్ని రక్షించుకోవాలి ఈ ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వండి ప్లీజ్ అని అరుంధతి అంటుంది. సరే బాలిక 11 గంటల 20 నిమిషముల కన్నా ఒక్క నిమిషము ఒంట్లో ఉన్న సరే నిన్ను తక్షణమే నా లోకం తీసుకుపోతాను అని గుప్తా అంటాడు.కట్ చేస్తే, భాగమతి పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలు అందరూ కిందికి రండి అని పిలుస్తుంది.
పిల్లలు పరిగెత్తుకొచ్చి భాగమతిని హగ్ చేసుకుంటారు. మిస్సమ్మ మనోహరి ఆంటీ కి డాడీ కి పెళ్లి ఆ పెళ్ళికి వెళ్లడం మాకు ఇష్టం లేదు అని అంజలి అంటుంది. నేనుండగా ఆ పెళ్లి జరగనివ్వను మీకు అన్యాయం జరగనివ్వను ఆరోజు కదా మధ్యలోనే ఆపేశాను కదా ఇప్పుడు పూర్తి చేస్తాను అని భాగమతి అంటుంది. ఏంటి ఆ చిన్న పాప కదా అని అంజలి అంటుంది. అవును తన జీవితం ముగిసిపోయిందని అనుకునే లోపు భగవంతుడు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆ పాప ప్రశ్నగా మిగిలిపోయిన తన కుటుంబాన్ని జీవితాన్ని కాపాడడానికి మళ్లీ వచ్చింది తనని పాతాళానికి తొక్కేసిన అమ్మాయితో యుద్ధం చేసైనా సరే తన కుటుంబాన్ని రక్షించుకోవాలని వచ్చింది అని భాగమతి అంటుంది. ఆ బ్యాడ్ పాపని ఈ పాపా గెలిచిందా అని అంజలి అడుగుతుంది. తన ప్రాణం పణంగా పెట్టైనా సరే తని గెలిచింది అని భాగమతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!