Nindu Noorella Saavasam January 29 2024 Episode 145: రాథోడ్ మిస్సమ్మ ఏం చెప్పాలని వచ్చిందో నీకు తెలుసా అని అడుగుతాడు అమరేంద్ర. నిజం చెప్పాలని వచ్చిందని చెప్తే అపార్థం చేసుకుంటాడా ఎందుకైనా మంచిది నాకు తెలీదని చెప్పడమే మంచిది అని రాథోడ్ అంటాడు. ఎందుకు అమర్ అంత ఆలోచిస్తున్నావు మిస్సమ్మ గురించి అని అంటుంది మనోహరి. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పాలని వచ్చిన తను చెప్పకుండానే వెళ్ళిపోతుంది ఏమన్న సహాయం కావాలని అడుగుతుందేమో అనిపిస్తుంది అని అంటాడు అమరేంద్ర. రేపటితో తనకున్న కష్టాలు తీరిపోతాయి అని మనోహరీ అంటుంది. అమర్ రాథోడ్ తనని అనుమానంగా చూసేసరికి మనోహరి తన కష్టాలు తీరిపోవాలని కోరుకుంటున్నాను అని అంటుంది. అమరేంద్ర భోజనానికి వెళ్తాడు. మిస్సమ్మ నాతోనే చాలెంజ్ చేస్తావా చూసావా నిన్ను ఎలా ఇంట్లో నుంచి పంపించేసాను అని అనుకుంటుంది మనోహరి.
భాగమతి హాస్పిటల్ కి వెళుతుంది.పిన్ని నాన్నకు ఏమైంది అని అడుగుతుంది భాగమతి.నాకేమీ అర్థం కావడం లేదు నాకు తెలియదు అని అంటుంది భాగమతి వాళ్ళ పిన్ని. ఏమైంది ఎందుకు ఇద్దరు మాట్లాడటం లేదుఏం జరిగింది అని అడుగుతుంది భాగమతి. మీ నాన్నకి ఇలా జరగడానికి కారణం నువ్వే అని ఎలా చెప్పాలి అని అంటుంది వాళ్ల పిన్ని. ఈడొచ్చిన పిల్లవి పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే నలుగురు ఏమంటారో తెలుసా ఆ మనిషి నోరు తెరిచి అడిగిన నువ్వు సమాధానం చెప్పలేదంటే ఆయన గుండె చావకుంటే ఏం చేస్తాడు అని అంటుంది వాళ్ల పిన్ని.పిన్ని అని అరుస్తుంది భాగమతి.నేను మీ అమ్మనైతే పెళ్లి గురించి మాట్లాడేదాన్ని కానీ పిన్నిని అయిపోయాను కాబట్టి జరిగేది చూడడం తప్ప ఏం చేయలేను అని అంటుంది. నా మాట విను భాగమతి మీ నాన్న కోసం పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు అని అంటుంది వాళ్ళ పిన్ని. కట్ చేస్తే,అరుంధతి గుప్త చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది.ఇంతలో అనాధాశ్రమం వార్డెన్ సరస్వతి వస్తుంది. ఆవిడను చూసిన అరుంధతి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అమర్ ఆవిడని చూసి కూర్చోమని చెబుతాడు. అరుంధతి చనిపోయిందని నాకు తెలియదు అమర్. తను అసలు చనిపోతుంది అనుకోలేదు అని అంటుంది సరస్వతి.
అందరు బాధ పడుతూ ఉంటారు. మనోహరి ఎక్కడుంది అని అడుగుతుంది సరస్వతి. తనను పిలుస్తాను అని అమర్ మనోహరిని పిలుస్తాడు. మనోహరి బయటికి వచ్చి ఈవిడ వచ్చింది ఎందుకు అని అనుకుంటుంది. మేడం మీరు వచ్చారా? ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను మనోహరి నీకు ఇంకా పెళ్లి కాలేదా అని అడుగుతుంది. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నావా ఎందుకలా ఉంటున్నావ్ అని అంటుంది సరస్వతి. మనోహరి నాకు కొంచెం పనుంది అని బయటికి వెళుతుంది. మనోహరి అరుంధతి చనిపోయిన తర్వాత నుండి మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్తాడు అమర్.
అరుంధతి చనిపోయేముందు తను ఎప్పుడు మనోహరి గురించి ఆలోచించేది, మీకు గుర్తుందా మీరు మనోహర్ని పెళ్లి చేసుకుంటాను అని వచ్చి అరుంధతి నచ్చిందని పెళ్లి చేసుకున్నారు, అరుంధతి తన స్నేహితురాలు బాధపడకూడదని తనకు ఒక మంచి వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలనుకునేది తనకంటూ ఒక మంచి జీవితం ఇవ్వడానికి ప్రయత్నించేది కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది.అమర్ నువ్వైనా అరుంధతి చివరి కోరిక తీర్చు మనోహరికి పెళ్లి చేయి అరుంధతి ఆత్మ శాంతిస్తుంది అని సరస్వతి అంటుంది. మనకు అరుంధతి అస్థికల గురించి గుర్తు చేసింది మనోహరి అరుంధతి మనోహరి పెళ్లి గురించి ఆలోచించింది ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో మనం కచ్చితంగా మనోహరికి పెళ్లి చేయాలి అని అంటుంది శివరాం భార్య. మనోహర్ పెళ్లి బాధ్యత నీదే అమర్ అని వెళ్ళిపోతుంది సరస్వతి. మనోహరి సరస్వతికి థాంక్స్ చెప్తుంది.
నువ్వు తప్పు చేస్తున్నావ్ మనోహరి ఇలాంటి అబద్దాలతో పాపాలతో ఏ బంధం నిలుకడగా ఉండదు అని అంటుంది సరస్వతి. ఆశ్రమానికి డబ్బులు ఇచ్చింది నిన్ను నీతులు చెప్పమని కాదు వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్ళిపో అని మనోహరి తనని లాక్కు వెళ్లి కార్లు కూర్చోబెడుతుంది. జాగ్రత్తగా వెళ్లండి ఒకవేళ మీకేమైనా జరిగితే పిల్లలు అనాధలు అయిపోతారు మళ్ళీ రోడ్డున పడతారు మళ్లీ అవసరం ఉంటే మళ్లీ పిలుస్తాను అని అంటుంది మనోహరి. మీరు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పినట్టు చేయాలి అని అంటుంది. ఇది విని అరుంధతి మను ఎందుకు ఇలా చేస్తుంది పిల్లల్ని అమర్ కి ఎందుకు దూరం చేయాలనుకుంటుంది మనోహరీ ఉద్దేశం ఏంటి ఎందుకిలా తప్పుల మీద తప్పులు చేస్తుంది అసలు ఇలా ఎందుకు మారిపోయింది అమర్ ని పెళ్లి చేసుకోవాలనే దీని ఆశ ఎందుకు ఇలా ఉంది నాకు దీన్ని చూస్తుంటే భయంగా ఉంది అని అరుంధతి అనుకుంటుంది.
కట్ చేస్తే, భాగమతి హాస్పిటల్ లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఖాళీ భాగమతి వాళ్ళ పిన్ని ఇద్దరూ హాస్పిటల్ కి వస్తారు. భాగమతి వాళ్ల పిన్ని తనని చూసి జుట్టు అంతా చెరిపేసుకొని ఏడుస్తూ వస్తుంది. రాత్రంత ఇక్కడే ఉన్నావా భాగమతి అని అడుగుతుంది వాళ్ళ పిన్ని. మాతో పాటు ఇంటికి వస్తే ఒక గంట అయినా నిద్రపోయే దానివి అని అంటుంది. చూడు భాగమతి కళ్ళు ఎలా ఉన్నాయో అని అంటాడు ఖాళీ. భాగమతి డాక్టర్ ని ఎలా ఉంది అని అడుగుతుంది. ప్రస్తుతానికి మీరు వెళ్లి చూడొచ్చు అని అంటారు డాక్టర్. భాగమతి లోపలికి వెళ్లి వాళ్ళ నాన్నని చూస్తుంది. నాన్న నేను భాగమతిని వచ్చాను అని అంటుంది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?