Venkatesh: హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో పెద్ద కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ఈ కుటుంబంలో మొదట మూవీ మొగల్ నిర్మాత దివంగత రామానాయుడు ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. దాదాపు 13 భాషలలో 150 కి పైగా చిత్రాలు నిర్మించి గిన్నిస్ రికార్డులలో చోటు సంపాదించుకున్నారు. కరెన్సీ నోటుపై ఉన్న అన్ని భాషలలో చిత్రాలు నిర్మించిన ప్రొడ్యూసర్ గా రికార్డులకు ఎక్కారు. సురేష్ ప్రొడక్షన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అతిపెద్ద బ్యానర్లలో ఒకటి. రామానాయుడు మరణించిన అనంతరం ఈ బ్యానర్ పనులు పెద్దకొడుకు సురేష్ బాబు దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఇదే కుటుంబం నుండి వెంకటేష్ హీరోగా చలామణి అవుతున్నారు. దగ్గుబాటి రానా కూడా విజయవంతంగా కెరియర్ కొనసాగిస్తున్నారు. అటువంటి ఈ కుటుంబం పై కేసు నమోదు కావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. విషయంలోకి వెళ్తే హైదరాబాద్ ఫిలింనగర్ డెక్కన్ కూల్చివేత కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నటుడు వెంకటేష్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు ఆదేశాలను దిక్కరించి కూల్చివేతకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల విలువైన భవనాన్ని కూల్చడంతో పాటు ఫర్నిచర్ ఎత్తికెల్లారని ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో నటుడు దగ్గుబాటి వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబులపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
లీజు విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేసారని డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సుమారు 60 మంది ప్రవేట్ బౌన్సర్లను పెట్టుకొని హోటల్ నీ ధ్వంసం చేశారని స్పష్టం చేయడం జరిగింది. దీనివల్ల తనకు 20 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వెంకటేష్ ఇతర కుటుంబ సభ్యులపై ఐపిసి 448, 452, 380, 506, 120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!