పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. `కేజీఎఫ్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న చిత్రమిది.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న తరుణంలో.. ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. పెద్ద దిక్కు ను కోల్పోవడం తో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ప్రభాస్.. ఇప్పట్లో షూటింగ్స్కు హాజరు అయ్యే అవకాశాలు లేవు.
ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పరిస్థితి అర్థం చేసుకున్న `సలార్` టీమ్.. నెక్ట్స్ షెడ్యూల్ ను అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో రీస్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. అప్పటికి పెదనాన్న మరణం నుంచి ప్రభాస్ కాస్త బయట పడతాడని భావించే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఇక ప్రభాస్ చేతిలో `ఆదిపురుష్`, `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్` చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా.. `ప్రాజెక్ట్ కె` సెట్స్ మీదే ఉంది. అయితే ఈ సినిమా షెడ్యూల్స్ కూడా అక్టోబర్ తర్వాతే ఉండనున్నాయని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!