Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. `ప్రాజెక్ట్-కె` వర్కింగ్ టైటిల్తో గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇందులో ప్రభాస్కు జోడీగా దీపికా పదుకొనె నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలను పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. ప్రభాస్ తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరనణు నిలిపివేశారని ఓ టాక్ బయటకు వచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇటీవల షూటింగ్ కు హాజరైన దీపికా పదుకొణె.. స్వల్ప అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె హెల్త్ గురించి కంగారు పడాల్సి పరిస్థితి ఏమీ లేదని డాక్టర్లు కూడా చెప్పారట. కానీ, ప్రభాస్ మాత్రం పదుకొణె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఓ వారం రోజుల పాటు సినిమా షూటింగ్ ను వాయిదా వేయాలని మేకర్స్ ను కోరాడట.
దీంతో షూటింగ్ను ఓ వారం రోజులు ఆపినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదంటూ టాక్ నడుస్తోంది. షూటింగ్ కు ఎక్కడా బ్రేక్ ఇవ్వలేదని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన దీపిక నేరుగా షూటింగ్ సెట్ కే వచ్చేసి షూట్ లో పాల్గొంటున్నారని అంటున్నారు. దీంతో ఏది నిజమో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!