Prema Entha Madhuram: అన్నయ్య ఇక నావల్ల కాదు కాళ్లు నొస్తున్నాయి అని ఆకాంక్ష అంటుంది.కట్ చేస్తే,యాదగిరి పిల్లల కోసం వెతుకుతూ వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి రేయ్ మల్లేష్ పిల్లల ఫోటోలు నీకు సెండ్ చేశాను మనవాళ్ళందరికీ పంపించి పిల్లలను వెతికించరా తొందరగా అని అంటాడు. పిల్లలిద్దరూ ఒక గుడి దగ్గరికి వచ్చి అన్నయ్య ఇక నేను నడవలేను నా కాళ్లు బాగా నోస్తున్నాయి కాసేపు కూర్చుంటాను అని ఆకాంక్ష కూర్చుంటుంది. వాళ్ళిద్దరూ గుడిలో కూర్చోగానే ఒక అతను బండి తెచ్చి అడ్డంగా పెడతాడు. అక్కడికి ఆర్య బైక్ వేసుకుని వచ్చి అక్కడున్న వాళ్ళందరిని అడిగి పిల్లలని చూడకుండానే వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,అను ఉష కూడా పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు రాధ గారు పార్కులో కూడా పిల్లలు లేరు ఎక్కడికి వెళ్ళుంటారు అని ఉష అంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు నాకు అర్థమైంది ఉష అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువచ్చి ఉషా వీల ఇంటికి వచ్చుంటారేమో వెళ్లి అడుగు అని అంటుంది.మీరు కూడా రండి రాధ గారు అని ఉషా అంటుంది.
నేను అక్కడికి వస్తే పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారని కంగారు పడతారు నువ్వు వెళ్లి అడుగు అని అను అంటుంది.ఉషా వెళ్లి సుబ్రహ్మణ్యం వాళ్ళని పిల్లల గురించి అడుగుతుంది వాళ్లు మా ఇంటికి రాలేదమ్మా అని అంటారు. పిల్లలు ట్యూషన్ నుంచి గుడికి వెళ్తామని చెప్పారు అంకుల్ నేను గుడికి వెళ్లి చూస్తాను అని ఉషా బయటకు వచ్చేస్తుంది. రాధ గారు పిల్లలు అక్కడ కూడా లేరు అని ఉష చెప్తుంది. ఇక్కడ కూడా లేరా ఎక్కడికి వెళ్లి ఉంటారు అని రాదా ఏడుస్తుంది. బాధపడకండి రాధా గారు అన్నయ్య బావ వెతుకుతున్నారు కదా ఎలాగైనా తీసుకువస్తారు ఇంటికి వెళ్దాం పదండి అని ఉష అంటుంది.కట్ చేస్తే,ఏంటమ్మా జ్యోతి పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలిసిందా అని సుగుణ అడుగుతుంది. ఇప్పుడే ఫోన్ చేసిన మి అల్లుడు గారికి చెప్పానమ్మా పిల్లలు దొరికితే వెంటనే ఫోన్ చేయమన్నాను అని జ్యోతి అంటుంది. భగవంతుడా పిల్లలు తొందరగా దొరికేలా చెయి అని సుగుణ బాధపడుతుంది. ఇంతలో హరీష్ వస్తాడు. ఏంటి దివ్య అందరూ అంత టెన్షన్ గా ఉన్నారు అని హరీష్ అంటాడు. ఏమీ లేదు పిల్లలు కనిపించకుండా పోయారు అని దివ్య జరిగిందంతా చెబుతుంది.
వాళ్ళు ఎక్కడికి వెళ్లి ఉంటారు వచ్చేస్తారులే కానీ మన పెళ్లి శుభలేఖలు వచ్చేసాయి ఎలా ఉన్నాయి శుభలేఖలు అని హరీష్ చూపెడతాడు. చాలా బాగున్నాయి హరీష్ నువ్వు కూర్చో నేను కాఫీ తెస్తాను అని దివ్య అంటుంది. సుగుణ కంగారుపడుతూ బయటికి వెళుతుంది. ఏంటి దివ్య నేనెంతో హ్యాపీగా ఇంటికి వస్తే ఎవరి మొహాల్లో సంతోషం లేదు నేను చాలా హర్ట్ అయ్యాను అని హరీష్ అంటాడు. సారీ హరీష్ అమ్మ పిల్లలు కనపడకపోయేసరికి టెన్షన్ గా ఉంది అని దివ్య అంటుంది.పిల్లల గురించి మనం ఎందుకు టెన్షన్ పడాలి అసలు మీ అన్నయ్యకు ఆవిడకు పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదా మళ్ళీ ఈ డిస్టబెన్స్ కూడానా ఎందుకో ఈ గొడవల వల్ల మి అమ్మ పెళ్లి జరగదనిపిస్తుంది అని హరీష్ అంటాడు. బాబు ఏమి అనుకోకపోతే నువ్వు దివ్య కూడా పిల్లల కోసం వెతుకుతారా అని సుగుణ అంటుంది. ఎవరో పిల్లల కోసం మేము రోడ్డు మీద పడి వెతకడం ఏంటి అని దివ్య అంటుంది. అదేంటమ్మా అలా అంటావ్ రాదా ఏమైనా పరాయిదా అని సుగుణ అంటుంది. ఎప్పుడు చూసినా నీ కొడుకు గోలేనమ్మ అందుకే మా పెళ్లి కూడానీ కొడుకు వల్ల ఆగిపోయేలా ఉంది అని దివ్య అంటుంది.అలా ఎందుకు అంటున్నావే మీ పెళ్ళికి నేను ఎందుకు అడ్డుపడతాను అని సుగుణ అంటుంది. అదేం కాదు అత్తయ్య గారు ఈ డిస్టబెన్స్ వల్ల పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని దివ్య బాధ అని హరీష్ అంటాడు.
ఏం జరగదులే బాబు మీ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని సుగుణ అంటుంది. జ్యోతి కాఫీ తెచ్చి ఇవ్వగానే హరీష్, కంగారుగా తాగేసి వెళ్లిపోతాడు. కట్ చేస్తే, ఏమైంది మానసి హరీష్ నుంచే నా ఫోను అని ఛాయా అంటుంది.అవును రాదని పెళ్లికి ఒప్పించడానికి పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అంట ఆర్య అందరూ కలిసి పిల్లల కోసం వెతుకుతున్నారంట అని మానస అంటుంది. ఎస్ ఇదే మా నాకు మంచి సమయం పిల్లల కోసం అందరు వెతుకుతున్నారు కదా వాళ్లని మనం వెతికి పట్టుకొని ఆర్య కి పిల్లలు నీ పిల్లలే అని చెప్పేస్తాను ఆ తరువాత అతను కళ్ళముందు పిల్లలు ఉన్నా గుర్తించుకోలేకపోయాను కాపాడుకోలేకపోయాను అని టెన్షన్ పడుతూ చావాలి అని జలంధర్ అంటాడు. ఇప్పుడే మన రౌడీలకు ఫోన్ చేస్తాను అన్నయ్య అని ఛాయా ఫోన్ చేస్తుంది రౌడీలకి. చెల్లమ్మ దీన్ని మనం మిస్ చేసుకోకూడదు ఆర్యవర్ధా న్ నికి ఇదే లాస్ట్ వార్నింగ్ ఇవ్వాలి పిల్లని మనం చంపేస్తుంటే కళ్ళముందు ఉంచుకొని కాపాడుకోలేకపోయానే అని విలవిలలాడిపోతూ ఉండాలి అని జలంధర్ అంటాడు.కట్ చేస్తే, ఆర్య వర్ధన్ ఒకపక్క వెతుకుతూ ఉంటాడు . యాదగిరి మరోపక్క వెతుకుతూ ఉంటాడు. అను ఏడుస్తూ పిల్లల కోసం వెతుకుతూ ఉంటుంది.
పిల్లలు ఎవరికీ కనిపించకుండా వెళ్తూ ఒక చెట్టు దగ్గర కూర్చొని అబ్బా అన్నయ్య ఇక నేను నడవలేను నాకు ఆకలి వేస్తుంది అని ఆకాంక్ష అంటుంది. ఆకలేస్తుందా మన దగ్గర డబ్బులు లేవే అని అభయ్ అంటాడు. మన దగ్గర పిగ్గి బ్యాంకు డబ్బులు ఉన్నాయి అవి తెచ్చుకొని ఉంటే బాగుండేది ఇప్పుడు ఎలా అన్నయ్య పొద్దున మనం పూజ కూడా చేయలేదు అని ఆకాంక్ష అంటుంది. అక్కి అక్కడ గుడి ఉంది అక్కడికి వెళ్లి దండం పెట్టుకుందాం దేవుడా మా కోరిక నెరవేర్చు అలాగే నీకు పూజ చేయలేకపోయాను క్షమించు అని చెప్పుకుందాం అని అభయ్ అంటాడు. దేవుడు ఏం కోపం తెచ్చుకోలే అన్నయ్య అమ్మానాన్నల కోసం అలా చేశామని అనుకుంటాడు అని ఆకాంక్ష అంటుంది. అక్కి మనం గుళ్లోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుందువు రా దేవుడు నీ ఆకలి తీర్చేస్తాడు అని అభయ్ అక్కడ కొళాయి ఉంటే మంచినీళ్లు కడుపునిండా తాగుతారు.
అన్నయ్య మనకు నిద్ర వస్తే ఎక్కడ పడుకుద0 శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్దామా అని ఆకాంక్ష అంటుంది. స్వామి మాలలు వేసుకొని గుళ్లో పడుకుంటారు కదా వాళ్లతో మనం పడుకుందాం అని అభయ్ అంటాడు. సరే పద అన్నయ్య పడుకుందామని పిల్లలిద్దరూ గుళ్లోకి వెళ్తారు. కట్ చేస్తే, సార్ పిల్లలు ఎక్కడా కనిపించలేదు ఎలా అని యాదగిరి అంటాడు. ఇప్పుడే జెండి కి కూడా ఫోన్ చేసి చెప్పాను పిల్లలు మాల వేసుకున్నారు కదా గుడికి వెళ్ళుంటారు వెళ్లి చూద్దాం పద అని ఆర్య అంటాడు. ఇంతలో గుడిలో అయ్యప్ప స్వామి భజన చేస్తూ ఉంటారు అందులో పిల్లలు కూర్చుంటారు. ఇంతలో ఆర్య అదే గుడికి పిల్లల కోసం వస్తాడు. అక్కి నాన్న గుడికి వచ్చాడు మనం వేరే చోటికి వెళ్దాం పద అని అభయ్ అంటాడు.ఇంతలో అను కూడా అదే గుడికి వస్తుంది. అమ్మా ని చూసి పిల్లలిద్దరూ షాక్ అవుతారు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!