న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి టాలీవుడ్ కు చెందిన ఓ హీరో తన పేరును ఎలా కావాలంటే అలా వాడుకోమని చెప్పాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. రానా దగ్గుబాటి. అసలెందుకు ఆ మాట అన్నాడో..? ఏం జరిగిందో..? తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఇటీవల `విరాట పర్వం`తో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి.. ఇప్పుడు `గార్గి`తో అలరించేందుకు సిద్ధమైంది.
ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా కాగా.. దీనిని డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించాడు. ఓ తప్పుడు కేసులో ఇరుక్కున్న తండ్రి కోసం కూతురు చేసే న్యాయ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో సాయి పల్లవి టీజర్గా కనిపించబోతోంది. తమిళంలో హీరో సూర్య, జ్యోతిక సమర్పిస్తుండగా, తెలుగులో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు.
మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం జూలై 15న తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది. అయితే ప్రమోషన్స్లో భాగంగా సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. `గార్గి కథ నా మనసుని కదిలించింది. అందరూ కనెక్ట్ అవుతారనిపించింది. అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నా. ఇప్పటికే సూర్య, జ్యోతికలకు ఈ సినిమా చూపించేశాం.
సూర్య చాలా ఇంప్రెస్ అయ్యారు. నేను సమర్పకుడిగా వ్యవహరిస్తా అన్నారు. తెలుగులో కూడా ఓ మంచి హీరో ఆ బాధ్యత తీసుకొంటే బాగుంటుందనిపించి.. వెంటనే రానాకు ఫోన్ చేశా. ఆయన నా మాట పూర్తవ్వకుండానే ఓకే చెప్పేశారు. తన పేరు ఎలా కావాలనుకుంటే అలా వాడుకో అన్నారు` అంటూ చెప్పుకొచ్చింది. కాగా, రానా-సాయి పల్లవి జంటగా `విరాట పర్వం`లో నటించారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్గా హిట్ అవ్వలేకపోయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!