Sai Pallavi-Pawan Kalyan: న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం `విరాట పర్వం` ప్రమోషన్స్తో బిజీ బిజీగా గడుపుతోంది. రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ మూవీలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
నక్సలిజం నేపథ్యంలో ఓ చక్కటి ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ మూవీ జూన్ 17న అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సాయి పల్లవి తాజాగా ఓ టీవీ షోలో పాల్గోంది. అయితే ఈ షోలో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఆయనంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్న సాయి పల్లవి.. ఆ ఇష్టానికి కారణాన్ని కూడా వివరించింది. `పవన్ కల్యాణ్ గారికి అంత క్రేజ్ ఉన్నప్పటికీ ఒక సాధారణమైన వ్యక్తి మాదిరిగానే ఆయన నడుచుకుంటారు. తన మనసులోని విషయాన్ని ముక్కుసూటిగా బయటకు చెబుతారు. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం, అభిమానం` అంటూ సాయి పల్లవి తెలిపింది.
దీంతో ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాగా.. అవి విని పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కాగా, విరాట పర్వంలో కామ్రేట్ రావన్నగా రానా కనిపించబోతున్నాడు. అలాగే రవన్న రాసిన పుస్తకాన్ని చదివి అతడి ప్రేమలో పడ్డ యువతి వెన్నెల గా సాయిపల్లవి నటించింది. సురేష్ బొబ్బిలి ఈ మూవీకి సంగీతం అందించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!