Trinayani January 04 2024 Episode 1142: మీరు భలే ఉన్నారు బాబు గారు నాకు ఆ విషయం ఎలా తెలుస్తుంది పంపినవాడు ఎవరో కానీ చాలా మంచి పని చేశాడు అని నైని అంటుంది. అదేంటి వదిన అలా అంటావు అని విక్రాంత్ అంటాడు. అవును విక్రాంత్ బాబు గాయత్రీ దేవి అమ్మగారు గొంతు వినగానే విశాల్ బాబు గారిలో సంతోషం చూశాను అలాగైనా వాళ్ళ అమ్మ మాట విని సంతోషించాడు బాబు గారు అని నైని అంటుంది. అవును నైని అమ్మి ఎదురుగా ఉండి మాట్లాడినంత సంతోషం కలిగింది అని విశాల్ అంటాడు. అవును విక్రాంత్ బాబు ఆ క్యాసెట్ మరొకసారి తీరిగ్గా చూడాలి ఎందుకంటే అందులో ఇంకా సగం ఏమైనా మిగిలిపోయిందేమో అని నైని అంటుంది. వదిన అందులో ఏమి లేదు రీల్ మాత్రమే ఉంది అని విక్రాంత్ అంటాడు. అమ్మగారి గొంతు వినడానికి రెండు మూడు గంటలు వెయిట్ చేస్తే తప్పేముంది విక్రాంత్ అని నైని అంటుంది. నైని నువ్వు ఆశించింది దొరుకుతుందేమో ప్రయత్నించు అని స్వామీజీ అంటాడు.
అలాగే గురువుగారు అని నైని వెళ్ళిపోతుంది. గురువుగారు నైనీకి నిజం తెలియకూడదు అనుకుంటున్నాను అని విశాల్ అంటాడు. ఎవరికి ఎప్పుడు ఏం తెలియాలో అది తెలుస్తుంది విశాల్ బాబు అని గురువుగారు అంటాడు. కట్ చేస్తే, ఏంటమ్మా హాసిని ఏదో ఐడియా చెప్తానన్నావ్ అని పావని మూర్తి అంటాడు.నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అమ్మ అని ఎద్దులయ్య అంటాడు. మాట వినిపిస్తుంది కానీ ఎవరు కనిపించట్లేదు ఏంటి అని హాసిని కాళ్ళు గట్టిగా పట్టుకుంటాడు పావన మూర్తి అంటాడు. బాబాయ్ నోకి చంపేస్తావా ఏంటి అసలే బక్కదాన్ని ఇల్లే అని హాసిని అంటుంది. ఎవరు చెప్తారు అయ్యా అని పావని మూర్తి అంటాడు. నాగులమ్మ రా అని డమ్మక్క పిలుస్తుంది. ఇప్పుడు ఈవిడ ఎందుకు వచ్చింది సుమన చూస్తే పెద్ద గొడవ చేస్తుంది అని హాసిని అంటుంది. పౌర్ణమి మూడు రోజులు అవుతుంది కదా అమ్మ ఉలోచిని చూసి వెళ్దామని వచ్చాను అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఇంతలో ఉలోచి ఎక్కడున్నావమ్మా పాలు తాగు అంటు సుమన పైకి వస్తుంది. గవ్వలు ఎక్కడున్నాయి ఆ గవ్వలు పట్టుకొని నాగులమ్మను కనపడకుండా చేద్దాము అని ఎద్దులయ్య అంటాడు.
అంత సమయం లేదు పెద్ద బొట్టమా నువ్వు పాముగా మారి నా ఒళ్ళు పడుకో అని హాసిని అంటుంది. పెద్ద బొట్టమ్మ పాముగా మారిపోయే హాసిని పైటకొంగులో పడుకుంటుంది. హాసిని చేత్తో తన పైట కొంగును పట్టుకుని నిలబడుతుంది. కట్ చేస్తే, బాబాయ్ ఉలోచి కనిపించిందా అని సుమన అంటుంది. పిల్ల రాలేదు కానీ తల్లి వచ్చిందమ్మా అని పావన మూర్తి అంటాడు. అంటే నువ్వు తల్లివి వచ్చావు నీ కూతురు రాలేదని అర్థం అమ్మ అని ఎద్దులయ్య సర్ది చెప్తాడు. నువ్వు ఎల్లమ్మ ఉలోచికి పాలు పట్టు అని పావన మూర్తి అంటాడు. అక్క నీ కొంగు ఎందుకు అలా పట్టుకున్నావు అని సుమన అడుగుతుంది. పామును పట్టుకున్నాను చెల్లి ఊలోచి నైట్ పూట పాముగా మారుతుంది కదా నా కొంగులు పట్టుకున్నాను అని హాసిని అంటుంది.
అక్క పగటిపూట ఉన్నప్పుడు ఉలిచిని ఎత్తుకొనివ్వను అలాంటిది నువ్వు పాముగా ఉన్నప్పుడు ఎందుకు ఎత్తుకుంటావు నువ్వు జోక్ చేస్తావని నాకు తెలియదా అని ఉలోచి ని పిలుస్తూ వెళ్ళిపోతుంది సుమన.సుమన వెళ్ళిపోయింది పెద్ద బొట్టమ్మ అమ్మాయిక నువ్వు వెళ్ళు అని హాసిని అంటుంది. ఉలోచిని చూసి వెళ్తానమ్మ అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఏదో ఐడియా చెప్తాను అన్నది అన్నావు అని ఎద్దులయ్య అంటాడు. నిన్న నైట్ వచ్చిందా నీ ప్రయోగించు హాసిని అమ్మ తిలోత్తమా బెంబేలెత్తిపోతుంది అని పెద్ద బొట్టమ్మ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, సుమన ఉలోచిని ఉయ్యాలలో పడుకోబెట్టి బెడ్ షీట్ కప్పి జో కొడుతుంది. పిల్లను బెడ్ షీట్ కప్పి చంపేస్తావా ఏంటి అని విక్రాంత్ అంటాడు. ఏమి చెయ్యను కానీ నువ్వు కుర్చీలో కూర్చో నేను పడుకోవాలి అని సుమన అంటుంది. నేను ఇక్కడే పడుకుంటే నీకేంటి ప్రాబ్లం అని విక్రాంత్ అంటాడు. నేను కింద పడుకోవాల్సి వస్తుంది కదా అని సుమన అంటుంది. ఎందుకు నువ్వు కూడా నా పక్కనే పడుకో అని విక్రాంత్ అంటాడు. నిజమామన దాంపత్య జీవితానికి పడుకోమంటున్నావేమో అని సుమన అంటుంది. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు పడుకో అని విక్రాంత్ అంటాడు.కట్ చేస్తే,బాబాయ్ ఫీజులన్నీ పీకే అని హాసిని అంటుంది.ఎందుకమ్మా అని పావనమూర్తి అంటాడు. తిలోత్తమని భయపెట్టాలి కదా బాబాయ్ అని హాసిని కరెంటు మెయిన్ బంద్ చేస్తుంది. కరెంటు పోగానే అందరూ ఏమైంది కరెంట్ ఎందుకు పోయింది అని కంగారు పడతారు. అరే ఇంకా జనరేటర్ కూడా పనిచేయట్లేదు ఏంటి అని అనుకుంటారు. ఇంతలో హాసిని బ్యాటరీతో ఒక బాక్స్ ఆన్ చేసి అందులో గాయత్రీ దేవి పాడిన పాటను ప్లే చేస్తుంది. చీకట్లో ఆ పాట పెట్టి లాంతరు పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఆ పాట వినగానే విశాల్ ఇది అమ్మ పాడిన పాట ఎవరు పెట్టారు అని అంటాడు. కరెంటు కూడా లేదు ఎలా వస్తుంది పాట అని నైని అంటుంది.
మమ్మీ పెద్దమ్మ పాడిన పాట వస్తుంది నిజంగానే పెద్దమ్మ వచ్చిందా అని భయపడి కిందికి వచ్చేసరికి హాల్లో లాంతరు పట్టుకొని గాయత్రీ దేవి లాగా హాసిని తిరుగుతూ ఉండడం చూసి వల్లభ తిలోత్తమ భయపడి పోతారు. అమ్మ నిజంగానే పెద్దమ్మ వచ్చింది చూడు లాంతరు పట్టుకుని పాట పాడుతూ ఉంది అని వల్లభ గట్టిగా వల్లభ అమ్మను పట్టుకొని భయపడతాడు. కరెంటు పోయిది నువ్వు ఇంత బాగా పడతావ్ అనుకోలేదు అని విక్రాంత్ అంటాడు. నేనెక్కడ పాడానండి అని సుమన అంటుంది. ఎవరు పాడారు చూద్దాం పదా అని కిందికి వస్తారు. హాసిని అటు ఇటు తిరుగుతూ ఉండగా తిలోత్తమ దగ్గరికి వచ్చేసరికి పాట ఆగిపోతుంది. ఏంటి పాట ఆగిపోయింది బ్యాటరీ అయిపోయిందేమో ఇంకొకసారి పెడితే బాగుండు అని అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నైని వెళ్లి మెయిన్ ఆన్ చేస్తుంది
వెంటనే కరెంట్ వస్తుంది. హాసిని తిలోత్తమ ఎదురుగా లాంతర పట్టుకొని కనపడుతుంది వెంటనే కోపంతో రగిలిపోయిన తిలోత్తమ హాసిని చంప మీద ఒక్కటి ఇస్తుంది. అమ్మ వదినను ఎందుకు కొట్టావు అని విశాల్ అంటాడు. విశాల్ గాయత్రి అక్క లాగా చీర కట్టుకొని నగలు పెట్టుకుని వచ్చినంత మాత్రాన గాయత్రి అక్క అయిపోదు కదా ఎందుకే అలా వచ్చి మమ్మల్ని భయపెట్టావు అని అడుగుతుంది తిలోత్తమ. అమ్మ నువ్వు వదిన చీర కట్టుకొని రావడమే చూసావు కానీ అమ్మ పాటను వినలేదు అని విశాల్ అంటాడు. ఆ పాట విన్నందుకే కదా గుండెల్లో భయం పుట్టి ఇలా కిందికి వచ్చి భయపడిపోతుంది అంతే కదా అత్తయ్య అని నైని అడుగుతుంది. నేనెందుకు భయపడతాను అని తిలోత్తమ బుకాయిస్తుంది. మీ మేకప్ చెదిరిపోయి ఒళ్లంతా చెమట పట్టి కంగారు పడుతున్న మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది అని హాసిని అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది