Trinayani January 19 2024 Episode 1141: .నీ గారడీ కనికట్టు సంగతి ఏంటో కనిపెట్టాలి పెట్టు అని సుమన అంటుంది. అలాగే అని విశాలాక్షి సుమనకి ప్రసాదం పెడుతుంది. సుమన విశాలాక్షి సూర్యుడికి నైవేద్యం పెట్టి వచ్చింది తిను అని అంటుంది.ఇప్పటిదాకా పలికావు కదా ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావ్ తిను అని విక్రమ్ అంటాడు. పిడకలతో తయారుచేసిన పాయసం కదా తినాలా వద్దా అని ఆగిపోయింది అని విశాల్ అంటాడు. బావ గారు చెప్పింది కరెక్ట్ అని సుమన అంటుంది. అంతేకానీ ప్రాణం పోతుందని చిట్టి మాతకు భయం లేదు అని ఎద్దులయ్య అంటాడు. తినేవే సుమన అని దురంధర అంటుంది. తింటాను కానీ నా ప్రాణం పోతే విశాలాక్షి కారణం అని సుమన అంటుంది. పాయసం వేసింది కానీ విశాలాక్షి అందులో ఏమైనా విషం కలిపి తెచ్చిందేమో అని తిలోత్తమ అంటుంది. తను ఎందుకు అలా చేస్తుంది అని నైని అంటుంది. చేస్తే గీస్తే మీరు చేస్తారు అని హాసిని అంటుంది.
అయితే ఎద్దులయ్య ముందు రుషి చూస్తాడు అని విశాలాక్షి ఎద్దులయ్యకి పాయసం పెడుతుంది. సోదరి నువ్వు పాయసం పెట్టావు ఎద్దులయ్య తిన్నాడు అతన్ని ప్రశ్న అడగాలి కదా అని పావన మూర్తి అంటాడు. నీ భార్య పేరేంటి ఎద్దులయ్య అని విశాలాక్షి అడుగుతుంది. నా భార్య పేరు సూర్య అని ఎద్దులయ్య సమాధానం చెబుతాడు. ఏంటయ్యా నీకు పెళ్ళాం కూడా ఉందా అని దురంధర అడుగుతుంది. సహధర్మచారని లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తారా మాత అని ఎద్దులయ్య అంటాడు. అంటే నీ భార్యను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతావా ఏంటి అని సుమన అంటుంది. అప్పుడు ఇది హాస్టల్ అవుతుంది అని తిలోత్తమ అంటుంది. అంతే కానీ ఎద్దులయ్యకి ఏమీ కాలేదని ఆలోచించరా అని ఢమ్మక్క అంటుంది. ఏమో మీరేమైనా అనుకోండి అనేసి సుమన గబగబా తినేసి ఉలవచి ఏడుస్తుంది అనే వెళ్ళిపోతూ ఉండగా తన గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఆగిపోతుంది సుమన. నైనీ లేచి తనకు మంచినీళ్లు తాపిస్తుంది.
విశాలాక్షి ఏమైంది అని విశాల్ అడుగుతాడు. తిన్నాక ప్రశ్న అడుగుతానని సుమన వెళ్ళిపోబోతుంది అది ప్రాణం తనకు తెలియదు అని విశాలాక్షి అంటుంది. విశాలాక్షి ఆ ప్రశ్న ఏంటో అడుగు అని విశాల్ అంటాడు. సుమన నువ్వు ఎవరికి ప్రమాదం తలపెట్టాలనుకున్నావో వారి వైపు వేలు చూపించు అని విశాలాక్షి అడుగుతుంది.నీ మనసులో ఉన్న ఆలోచన కదా మేము ఏమి అనుకోములే చూపించు చిట్టి అని హాసిని అంటుంది. విశాల్ వంక విక్రాంత్ వంక వేలు చూపెడుతుంది సుమన దానితో తనకి విషం విరిగిపోయి మామూలు మనిషి అయిపోతుంది. నా కొడుకుని చంపేద్దామనుకుంటావా ఇంతకీ ఏం చేద్దాం అనుకున్నావ్ అని తిలోత్తమ అంటుంది. అత్తయ్య నిజం చెప్పిందని సంతోషిద్దాం అని నైని అంటుంది. అందరూ షాక్ లో ఉండిపోతారు.విక్రాంత్ బాబు మీరు జాగ్రత్తగా ఉండండి అని నైని కూర్చుని పాయసం తింటుంది. విశాల్ బావకి నైనీ అక్క వైపు చూపిద్దామనుకున్నాను కానీ ఈలోగా ప్రాణం పోయినంత పని అయింది అందుకే విగ్రహం వైపు చూపించాను అని సుమన అంటుంది.
నా వైపు చూపించి బ్రతికి పోయావు పోనీలే నీ మనసులో ఏముందో అర్థమైంది అని విక్రాంత్ అంటాడు. ఇప్పుడు ఎవరికి పాయసం వడ్డించను అని విశాలాక్షి అంటుంది. వద్దమ్మా నీ పాయసం నువ్వు అని దురంధర అంటుంది. లేదు పాయసం వడ్డించాల్సిందే నిజాలు తెలియాల్సిందే అని విశాలాక్షి తనకు నచ్చినవి అడుగుతుంది అదే నేనైతే నా అనుమానాన్ని అడిగి సమాధానం పడతాను అని తిలోత్తమ ఆ కుండను తీసుకుంటుంది. మమ్మీ నువ్వు ఎవరికి వడ్డిస్తావు అని వల్లభ అంటాడు. నైనికి వడ్డిస్తే ప్రసాదం అనుకొని భక్తితో తినేస్తుంది అందుకే విశాల్ కు వడ్డించాలనుకుంటున్నాను అని తిలోత్తమ వడ్డిస్తుంది. అమ్మ నాకెందుకు అని విశాల్ అంటాడు. నీకెందుకంటావ్ ఏంటి నాన్న నీకేమైనా అయితే ఇల్లు అన్యాయం అయిపోతుంది అందుకే నీకు వడ్డీంచి నిన్ను కొషన్ అడుగుదామనుకున్నాను అని తిలోత్తమ అంటుంది. ఈ రాక్షసికి విశాల్ మీద డౌట్ వచ్చి ఉంటుంది నిజం చెప్తే ప్రాణం పోతుంది ఇప్పుడు ఎలా అని నైని టెన్షన్ పడుతుంది.
విశాల్ పునర్జన్మ ఎత్తిన గాయత్రి అక్కని నువ్వు చూసావా అని తిలోత్తమ అడుగుతుంది. చాలా తెలివిగా అడిగింది అమ్మ అని డమ్మక్క అంటుంది. ఏం చెప్పినా సంకటమే అని ఎద్దులయ్య అంటాడు. చెప్పాలి చెప్పడానికి ఎందుకు అంత టైం తీసుకుంటున్నవ్ తమ్మి అని అంటాడు. గాయత్రమ్మని చూశారా అని నైని అడుగుతుంది. చూశాను అని విశాల్ అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. చూసావా ఎక్కడ విశాల్ అని తిలోత్తమ అంటుంది. చూసినప్పుడు ఎందుకు చెప్పలేదు బ్రో అని విక్రమ్ అంటాడు. ఒక్కటే ప్రశ్న అడగాలి రెండో ప్రశ్నకు తావు లేదు అని విశాలాక్షి అంటుంది.ఈ పాయసం ప్రోగ్రాం అయిపోయాక చెప్పాలి కదా ఎలా తప్పించుకుంటాడు అని వల్లభ అంటాడు. ఇంటికి తీసుకురాకుండా బావగారు ఎలా ఊరుకున్నాడు ఎంత కఠిన హృదయం చూడండి అని సుమన అంటుంది. ఇక నువ్వు ఆపుతావా ఎందుకు తీసుకురాలేదో కారణం ఉంటుంది అని విక్రమ్ అంటాడు. అందరికీ వడ్డిస్తావా అమ్మ అని డమ్మక్క అంటుంది. ఇప్పటికే ప్రశ్నలతో అందరూ సతమతమవుతున్నారు ప్రసాదం తిని చెయ్ కడుక్కుంటే సరిపోతుంది అని విశాలాక్షి అందరికీ పాయసం వడ్డిస్తుంది అందరూ తినేసి వెళ్లి చేయి కడుక్కుంటారు. కట్ చేస్తే, విక్రాంత్ ఉలోచిని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తే విచిత్రంగా ఉంది అని సుమన అంటుంది.
ఎలాగో తనని నేనే చూసుకోవాలి కదా అందుకే ఇప్పటినుంచి అలవాటు చేసుకుంటున్నాను అని విక్రాంత్ అంటాడు. ఇంతలో విశాల్ వచ్చి సుమన ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో అని విశాల్ చెబుతాడు. నేను అనడం లేదు విక్రాంత్ ఉద్దేశాన్ని నీకు చెప్తున్నాను అని అంటాడు. నేనెందుకు వెళ్లాలి అని సుమన అంటుంది. నువ్వు వెళ్లకపోతే నేను ప్రాణాలతో ఉండను కదా అని విక్రమ్ అంటాడు. ఎందుకు విశాల్ బాబు మీ తమ్ముడు ప్రాణాలు పోతాయని భయపడుతున్నారా అని నైని అంటుంది. అంతే కదా నైని అని విశాల్ అంటాడు. మీరు ఒక తల్లి కడుపున పుట్టకపోయిన అంత ప్రేమగా ఉంటే మరి మా అక్క చెల్లెలు ఎలా ఉండాలి అని నైని అంటుంది. అలా అంటావ్ ఏంటి వదిన అని విక్రం అంటాడు. అలాంటప్పుడు నాతో ఎంతో ప్రాణంగా ఉండే మీ అన్నయ్య గాయత్రి అమ్మగారిని చూసిన తర్వాత కూడా చెప్పకుండా ఎలా ఊరుకున్నారు అని నైని అడుగుతుంది.
చాలా మంచి ప్రశ్న అడిగావు అక్క అని సుమన అంటుంది. ఏంటి రెచ్చగొడుతున్నావా అని విక్రాంత్ అంటాడు. గాయత్రీ అత్తయ్య గారిని కన్నది మా అక్క అయితే తన కూతుర్ని చూడాలని అక్క కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తుంటే దాచిపెట్టి మీ బావగారు అక్కకి అన్యాయం చేశాడు అది కాదా అని సుమన అంటుంది. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో లోతుగా ఆలోచిస్తే అదే అర్థమవుతుంది అని విశాల్ అంటాడు. అంతేకానీ మీరు మాత్రం నిజం చెప్పనంటారా బాబు గారు అని నైని అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.