మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన `ఉప్పెన` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన వైష్ణవ్ తేజ్.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.
ఆ తర్వాత వైష్ణవ్ నుంచి వచ్చిన `కొండపొలం` చిత్రం పెద్దగా అలరించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరో `రంగ రంగ వైభవంగా`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. గిరీశాయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా నటించింది.
సెప్టెంబర్ 2 ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్లో భాగంగా వైష్ణవ్ తేజ్ పాపులర్ టీవీ షో అలీతో సరదాగాలో తాజాగా పాల్గొన్నాడు. ఈ షోలో వైష్ణవ్ ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఉప్పెన సినిమా స్టొరీ పెదమామయ్య చిరంజీవి విని ఓకే చెప్పిన తర్వాతే చేశానని వైష్ణవ్ వెల్లడించాడు.
ఉప్పెనలో ఒక సీన్ చేస్తున్న సమయంలో ఎమోషన్స్ ను పండించలేక 20 టేక్స్ తీసుకున్నానని, చివర్లో ఏడ్చేశానని తెలిపారు. ఇక ఈ క్రమంలోనే తన చినమావయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాను 120 సార్లు బద్రి సినిమాను 130 సార్లు చూశానని పేర్కొన్నాడు. ఏదేమైనా ఎంత అభిమానం ఉంటే మాత్రం అన్ని సార్లు సినిమా చూస్తారా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!