టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో నాలుగు రోజుల్లో `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
ఈ మూవీ అనంతరం విజయ్ మళ్లీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే `జనగణమన` అనే మూవీ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది. వంశీ పైడిపల్లి, ఛార్మీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. అలాగే విజయ్ మరోవైపు సమంతో కలిసి `ఖుషి` అనే సినిమా కూడా చేస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్స్ గురించి పక్కన పెడితే.. గతంలో సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని ప్రకటించారు. 2020లోనే ఈ మూవీని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. సుకుమార్ `పుష్ప`తో బిజీగా ఉంటే.. విజయ్ వరుస ప్రాజెక్ట్స్ను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నారు.
దీంతో వీరిద్దరి సినిమా అటకెక్కినట్టే అని అందరూ భావించారు. కానీ, ఈ ప్రాజెక్ట్ ఆగలేదట. `లైగర్` ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. సుకుమార్ సినిమాపై అదిరిపోయే గుడ్న్యూస్ ను వెల్లడించాడు. సుకుమార్తో సినిమా ఆగలేదని, కానీ దానికి కాస్త సమయం పడుతుందని విజయ్ తెలిపాడు. సుకమార్ ప్రస్తుతం పుష్ఫ-2తో బిజీగా ఉన్నాడని, ఈ చిత్రం పూర్తి కాగానే తమ సినిమా పట్టాలెక్కనుందని కూడా ఆయన వెల్లడించాడు. ఈ అప్డేట్తో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!