పంటి సమస్య మనలో చాలా మందిని తరచూ ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. పంటి నొప్పి కారణంగా మనం వేడి, చల్లటి పదార్థాలను తినలేము తాగలేము.కారణాలేవైనప్పటికీ ఈ సమస్య నుండి బయటపడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చాలా మంది పంటి నొప్పి సమస్య నుండి సత్వర ఉపశమనాన్ని పొందడానికి పెయిన్ కిల్లర్ ను, యాంటీ బ్యాక్టీరియల్ మందులను వాడుతూ ఉంటారు. అయితే మందులతో పాటుగా మన వంటింట్లో ఉండే పదార్థాలతో నిమిషాల్లోనే మనం పంటి నొప్పి సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా..
పంటి నొప్పిని తగ్గించడంలో మిరియాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాల నొప్పుల నుండి ఉపశమాన్ని కలిగించడంలో దోహదపడతాయి.దంతాల నొప్పులతో బాధపడే వారు ముందుగా రోట్లో ఒక టీ స్పూన్ మిరియాలను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పావు టీ స్పూన్ ఉప్పును వేసి కలపాలి.
తరువాత ఇందులో అర టీ స్పూన్ లేదా తగినన్ని నీళ్లను పోసి ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా చేసుకుని చేత్తో కానీ, బ్రష్ తో కానీ తీసుకుని నొప్పి ఉన్న పంటి పైన ఉంచాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న దంతం పైన 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచిన తరువాత నోటిని శుభ్రంగా చేసుకోవాలి.ఈ మిరియాల మిశ్రమంతో రోజుకు రెండు పూటలా దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి.