కరోనా వైరస్.. రోజురోజుకు వికృతరూపం దాల్చుతోంది. వ్యాక్సిన్ లేకపోవడంతో.. దీనిని కట్టడి చేయడం కూడా పెద్ద సవాల్గా మారింది. దీంతో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రా ణాంతక కరోనాకు.. డెంగ్యూ జ్వరం కూడా తోడైంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అవ్వడంతో.. చాలా మంది డెంగ్యూ బారిన పడ్డారు. వాస్తవానికి విష జ్వరాలు ఉన్నప్పుడు వాటి తాలూకూ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
కానీ, డెంగ్యూ జ్వరం వస్తే.. ఆ లక్షణాలు ఏవీ కనిపించవు. బాడీపెయిన్స్ ఉండవు. కానీ, లోలోపలే.. వ్యాధి తీవ్రత ఎక్కువై పోతుంది. ఈ క్రమంలోనే డెంగ్యూ బారిన పడి వందలాది మంది రోగులు హాస్పిటల్స్లో మృత్యువాత పడుతున్నారు. మరి ప్రాణాంతక వైరస్ కరోనా మరియు మాయదారి రోగం డెంగ్యూ నుంచి రక్షణ పొందాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా విషయంలో, వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక దూరాన్ని పాటించాలి. అదే విధంగా చేతులు కడుక్కోండి, శానిటైజర్ వాడండి మరియు శుభ్రమైన మాస్కును ధరించాలి.
అలాగే డెంగ్యూ విషయంలో, ఇంటి చుట్టు నీరు నిల్వ ఉండకుండా, నీరు చేరకుండా జాగ్రత్త తీసుకోవాలి . మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. బ్లీచింగ్ పౌడర్ లేదా యాంటీ లార్వా స్ప్రే వినియోగించాలి. మస్కిటో కోయిల్స్, ఆల్ఔట్ వంటి వాటిని ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు దోమలు . రాకుండా మూసి ఉంచాలి. అలాగే సమతుల్య ఆహారం మరియు శారీరక వ్యాయామం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడం చాలా అవసరం. రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే రోగాలు రాకుండా రక్షించుకోగలం. నీరు ఎక్కువగా తీసుకోవాలి. అదే సమయంలో కాచి ఒడబోసిన నీళ్లు మాత్రమే తాగాలి.ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించడం వలన జబ్బుల బారిన పడకుండా రక్షణ కల్పించుకోవచ్చు .