Curd: పాలలో బెల్లం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. అయితే బెల్లం పాలతోనే కాదు పెరుగుతోను కలుపుకొని తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. పైగా ఇది తినడానికి రుచికరంగా కూడా ఉంటుంది.. ఇలా తరచూ తినడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!
పెరుగులో బెల్లం కలిపి తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తప్రసరణ మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.. హైపర్ టెన్షన్ ప్రమాదం నుంచి కూడా కాపాడుతుంది.. పెరుగులో కొద్దిగా బెల్లం కలిపి తీసుకుంటే జీర్ణం సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.. గ్యాస్, అసిడిటీ కడుపులో మంట, కడుపు నొప్పి తగ్గించడంతోపాటు మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది.. దంతాలు, ఎముకలు బలంగా దృఢంగా ఉండేలా చేస్తుంది.
పెరుగు బెల్లం కలిపి తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతారు.. అధిక బరువుతో బాధపడుతున్న వారు భోజనం తర్వాత ఒక కప్పు బెల్లం కలిపిన పెరుగు తినండి.. అతిగా ఆకలి వేయడం కూడా తగ్గుతుంది.. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.. ఈ మిశ్రమం తీసుకోవడం వలన రక్త హీనత సమస్య తగ్గుతుంది. స్త్రీలలో నెలసరి సమస్యలు ఉన్నవారు పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే రుతుక్రమం సక్రమంగా వస్తుంది. పెరుగులో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేసినప్పటికీ.. దీనిని కేవలం మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలట. రాత్రి పూట తీసుకోవడం వల్ల ఇతర అనర్ధాలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..